AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court 2021: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో నూతన అధ్యయనం..

2021వ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల నియామకం విషయంలో నూతన అధ్యయనం ప్రారంభమైంది....

Supreme Court 2021: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నియామకంలో నూతన అధ్యయనం..
Srinivas Chekkilla
|

Updated on: Dec 31, 2021 | 6:46 PM

Share

2021వ సంవత్సరంలో భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల నియామకం విషయంలో నూతన అధ్యయనం ప్రారంభమైంది. ఆగస్ట్ 2021లో 9 మంది న్యాయమూర్తులను నియమించారు. హైకోర్టు నుంచి ఎనిమిది మంది న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాది ఒకేసారి ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. ఈ తొమ్మిది మంది న్యాయమూర్తులలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు.

జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ బివి నాగరత్న ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీతో కలిపి సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 4కు పెరిగింది. సుప్రీం చరిత్రలో ఇంత మంది మహిళా న్యాయమూర్తులు ఉండడం ఇదే మొదటిసారి. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే జస్టిస్ బివి నాగరత్న 2027 సంవత్సరంలో ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు కొలీజియం ఈ ఏడాది నవంబర్‌లో స్వలింగ సంపర్కుల న్యాయవాది సౌరభ్ కిర్పాల్ పేరును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి సిఫారసు చేసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ కిర్పాల్ కుమారుడు అయిన సౌరభ్ కిర్పాల్ పేరును హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడం కోసం ఢిల్లీ హైకోర్టు కొలీజియం 2017లో నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు నవంబర్‌లో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అంగీకరించి కిర్పాల్ పేరును ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి సిఫార్సు చేశారు.

ఇది కాకుండా, అలహాబాద్, రాజస్థాన్, కలకత్తా, జార్ఖండ్, కేరళ, మద్రాస్, మధ్యప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, పంజాబ్ & హర్యానా, గౌహతి హైకోర్టులకు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం 63 పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం ఒకేసారి ఎనిమిది మంది న్యాయమూర్తులను వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సిఫారసు చేయడంతో సుప్రీంకోర్టు మరో రికార్డు సృష్టించింది.

Read Also.. Sabarimala: మళ్లీ తెరచుకున్న శబరిమల ఆలయం.. భక్తులకు ఈ షరతులు వర్తిస్తాయి..