కంగనా ఆఫీసు కూల్చివేతపై స్టే జారీ చేసిన బాంబే హైకోర్టు
ముంబైలో కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే జారీ చేసింది. కూల్చివేతను ఆపివేసేలా చూడాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.
ముంబైలో కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే జారీ చేసింది. కూల్చివేతను ఆపివేసేలా చూడాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. ఈ కార్యాలయం అక్రమ కట్టడమంటూ కార్పొరేషన్ ఇఛ్చిన నోటీసును కంగనా సవాల్ చేసింది. కోర్టు ఉత్తర్వులు తమకు తాత్కాలికంగా ఊరట నిచ్చాయని కంగనా తరఫు లాయర్ రిజ్వాన్ సిద్దిఖీ అన్నారు. అటు ఆమె కార్యాలయంలోకి ఎలా ఎంటరయ్యారని కార్పొరేషన్ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఇందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. కాగా… కంగనా పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.