భలే మంచి చవక భేరం..! 80రూపాయలకే కిలో వంటగ్యాస్‌.. నడిరోడ్డుపై బహిరంగంగానే అమ్మకాలు..!

రద్దీగా ఉండే రహదారులపైనే మైకు పెట్టి కిలో గ్యాస్ 80 రూపాయలే.. కొనుగోలు చేయండి..మంచి తరుణం మించిన దొరకదు అంటూ..బషిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు

భలే మంచి చవక భేరం..! 80రూపాయలకే కిలో వంటగ్యాస్‌.. నడిరోడ్డుపై బహిరంగంగానే అమ్మకాలు..!
Selling Lpg Gas1
Follow us

|

Updated on: Feb 09, 2023 | 9:20 PM

గుజరాత్‌లో గ్యాస్ రీఫిల్లింగ్ కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటిదే మరో కొత్త విచిత్ర కేసు వినడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సూరత్‌లోని పల్సానా తాలూకాలో కూరగాయల మాదిరిగా ఎల్‌పీజీ గ్యాస్‌ అక్రమ విక్రయాలు బహిరంగంగా కొనసాగుతున్నాయి. మైక్రోఫోన్‌తో గ్యాస్‌ను కిలో 80 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎల్పీజీ గ్యాస్‌ను పబ్లిక్‌ రోడ్డుపై తూకం వేసి కిలో 80 రూపాయలకు అక్రమంగా విక్రయిస్తున్నారు. సిస్టమ్ ఇంకా చలనంలో లేనప్పటికీ, ఈ గ్యాస్ రీఫిల్లింగ్‌లలో కొన్నింటి నుండి మాఫియాదే ఇష్టారాజ్యంగా సాగుతోందని తెలుస్తోంది.

సూరత్‌ జిల్లా పల్సానా తాలూకాలోని చాలా గ్రామాల్లో మైక్రోఫోన్‌ పెట్టి అక్రమంగా ఎల్‌పిజి గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నారు. ప్రజారోడ్డుపై మైకు పెట్టి కిలో గ్యాస్ 80 రూపాయలే.. కొనుగోలు చేయండి..మంచి తరుణం మించిన దొరకదు అంటూ..బషిరంగంగానే అమ్మకాలు సాగిస్తున్నారు. గ్యాస్ రీఫిల్లింగ్ అక్రమ వ్యాపారం సాగుతోంది. ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ సౌకర్యం లేకుండా రోడ్డుపైనే గ్యాస్‌ విక్రయాలు సాగిస్తున్నారు. ఇటువంటి గ్యాస్ మాఫియాలకు అనుమతి ఎలా వచ్చింది. ఇంత విచ్చల విడిగా గ్యాస్ విక్రయించడానికి దేశీయ గ్యాస్ సిలిండర్లను ఎవరు సరఫరా చేస్తారు? ఏదైనా పెద్ద విపత్తు జరిగితే దానికి బాధ్యులెవరు? అనేది మాత్రం సమాధానంలేని ప్రశ్నలే.

https://divya-b.in/ZdJLSiaMfxb

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై సిస్టమ్‌ను ప్రశ్నించగా.. అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ జరుగుతున్నట్లు తెలిసిందని, అయితే సప్లయ్‌ అధికారి సెలవులో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోలేమన్నారు. అయితే, మేము బాలేశ్వర్ గ్రామంపై దాడి చేశామని చెప్పారు. వారి వద్ద నుంచి మొత్తం 14 వేల 300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..