Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lockdown Effect: కరోనా కారణంగా మన దేశంలో ఎంతమంది పిల్లల చదువులు దెబ్బతిన్నాయో తెలుసా?

భారతదేశంలో కరోనా కారణంగా చాలా మంది విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయి. వీరిలో ఎక్కువ మంది బాలికలే. యునెస్కో లెక్కల ప్రకారం, భారతదేశంలోని మొత్తం స్కూల్ డ్రాపవుట్ బాలికలలో సగానికి పైగా తిరిగి పాఠశాలకు రావడం లేదు.

Lockdown Effect: కరోనా కారణంగా మన దేశంలో ఎంతమంది పిల్లల చదువులు దెబ్బతిన్నాయో తెలుసా?
Corona Affect On Education
Follow us
KVD Varma

|

Updated on: Nov 11, 2021 | 7:35 PM

Lockdown Effect: భారతదేశంలో కరోనా కారణంగా 29 కోట్ల మంది విద్యార్థుల చదువులు దెబ్బతిన్నాయి. వీరిలో 13 కోట్ల మంది బాలికలే. యునెస్కో లెక్కల ప్రకారం, భారతదేశంలోని మొత్తం స్కూల్ డ్రాపవుట్ బాలికలలో సగానికి పైగా తిరిగి పాఠశాలకు రావడం లేదు. కరోనా కారణంగా, 11 కోట్ల మందికి పైగా ప్రీ-ప్రైమరీ మరియు సెకండరీ స్థాయి పిల్లలు ఇప్పటికీ పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం విద్యార్థులలో 7.5%.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు సగటున 4.5 నెలల పాటు మూసివేశారు. దీంతో చిన్నారుల పౌష్టికాహారం, భవిష్యత్తు ఆదాయంపై ప్రభావం పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

భారతదేశ పరిస్థితి ఇదీ..

కరోనా కేసులు పెరిగిన తర్వాత 2020 మార్చిలో భారతదేశంలో పాఠశాలలు కూడా మూసివేశారు. భారతదేశంలోని పాఠశాలలు గత 18 నెలలుగా మూసివేసి ఉన్నాయి. ఈ కాలంలో పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు కొనసాగినప్పటికీ, డిజిటల్ విభజన, ఇతర కారణాల వల్ల ఆన్‌లైన్ తరగతులు లోపభూయిష్టంగా కొనసాగాయి. ప్రస్తుతం, వివిధ ప్రోటోకాల్‌ల మధ్య దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరుచుకున్నాయి.

ప్రపంచంలో అత్యధిక కాలంగా పాఠశాలలు మూతపడిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. పాఠశాలల మూసివేత కారణంగా 29 కోట్ల మంది పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. వీరిలో 14 కోట్ల మంది బాలికలు, 15 కోట్ల మంది బాలురు ఉన్నారు. అత్యధికంగా 13 కోట్ల మంది పిల్లలు ఉన్నత పాఠశాలల్లో ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలోనే అత్యధికంగా పాఠశాల మానేసిన వారు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో పాఠశాల డ్రాపౌట్ రేటు 34.3గా ఉంది. ఇది దేశంలోనే అత్యధికం. తరువాత 32.3 శాతంతో అసోం నిలిచింది. ఇక త్రిపుర 26.7 శాతం, గుజరాత్ 23.7 శాతం, ఒడిశా 23.6 శాతం డ్రాపవుట్స్ తో తరువాతి స్థానాల్లో నిలిచాయి. అదే సమయంలో, ఇది పంజాబ్‌లో అత్యల్పంగా (1.6) ఉంది. అయితే, ఈ గణాంకాలు 2019-20 సీజన్‌కు సంబంధించినవి. లాక్‌డౌన్‌ తర్వాత ఈ గణాంకాలు పెరిగాయి. త్రిపుర, అస్సాం, మధ్యప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్‌లో సెకండరీ స్థాయి విద్యార్థుల డ్రాపౌట్ రేటు 25% కంటే ఎక్కువ పెరిగింది.

ఇప్పుడిప్పుడే పరిస్థితులు గాడిలో పడుతున్నప్పటికీ భారత్ లో తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూలుకు వెళ్ళే విషయంలో చాలావరకూ వెనకడుగు వేస్తున్నారు. కరోనా మూడో వేవ్ పొంచి ఉండొచ్చనే అనుమానాలతో పిల్లలను స్కూలుకు పంపించడానికి సంకోచిస్తున్నారు. ఇంకా ఇప్పటికీ చాలామంది పిల్లలు ఆన్ లైన్ క్లాసులతోనే చదువు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా 7వ తరగతి వరకూ చదువుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం ఇప్పటికీ స్కూల్సుకు వెళ్ళడం లేదు.

ఇవి కూడా చదవండి: Air Bags for Bikes: బైకులకూ ఎయిర్‌బ్యాగ్‌లు.. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి.. ఇది ఎలా పనిచేస్తుందంటే..

Afghanistan Crisis: అందరి కృషితోనే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో శాంతి సాధ్యం అవుతుంది.. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఏకాభిప్రాయం!

Air Pollution: కాలుష్యం మహిళా కార్మికుల జీవితాలను కాటేస్తోంది.. అక్కడ 50 శాతం పెరిగిన ఊపిరితిత్తుల రోగాలు!