AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russian Engineer: ఒడిశాలో మ‌రో ర‌ష్యా వ్య‌క్తి మృతి.. లంగరు వేసిన ఓడలో శవమైన తేలిన చీఫ్‌ ఇంజనీర్‌..

డిసెంబరు 24న పావెల్ ఆంటోవ్ రెండంతస్తుల హోటల్ టెర్రస్ పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. పోస్ట్‌మార్టంలో అంతర్గత గాయాలతో మృతి చెందినట్లు తేలింది. బిడెనోవ్ శవపరీక్ష అతను గుండెపోటుతో మరణించాడని సూచించింది.

Russian Engineer: ఒడిశాలో మ‌రో ర‌ష్యా వ్య‌క్తి మృతి.. లంగరు వేసిన ఓడలో శవమైన తేలిన చీఫ్‌ ఇంజనీర్‌..
Russian Engineer
Jyothi Gadda
|

Updated on: Jan 03, 2023 | 12:00 PM

Share

ఒడిశాలో మ‌రో ర‌ష్యా వ్య‌క్తి శ‌వ‌మై తేలాడు. ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌లో లంగరు వేసిన ఓడలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 50 ఏళ్ల రష్యన్ వ్యక్తి మరణించాడు. గ‌త 15 రోజుల్లో ఆ దేశానికి చెందిన మూడో వ్య‌క్తి ఒడిశాలో మ‌ర‌ణించాడు. అత‌న్ని మిల్య‌కోవ్ సెర్గీగా గుర్తించారు. జ‌గ‌త్సింగ్‌పుర్ జిల్లాలోని పారాదీప్ పోర్టు వ‌ద్ద ఉన్న ఓ షిప్‌లో అత‌న్ని మృత‌దేహాన్ని గుర్తించారు అధికారులు. బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్ నుంచి పారాదీప్ మీదుగా ఆ నౌక ముంబై వెళ్తోంది. ఆ షిప్‌లో సెర్గీ చీఫ్ ఇంజినీర్‌గా ఉన్నారు. రెండు వారాల క్రితం ఒడిశాలోని రాయ్‌గ‌డ్ జిల్లాలో ఓ ర‌ష్యన్ ఎంపీతో పాటు మ‌రో వ్య‌క్తి అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఎంపీ పావెల్ ఆంటోవ్ హోట‌ల్ గ‌ది నుంచి ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న ఫ్రెండ్ బిడెనోవ్ కూడా అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయాడు. అయితే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) ఆ ఇద్దరు రష్యన్‌ల అనుమానాస్పద మరణాలపై విచారణ జరుపుతోంది.

ఇదిలా ఉండగానే, జనవరి 03న (మంగళవారం) ఉద‌యం 4.30 నిమిషాల‌కు షిప్‌లోని చాంబ‌ర్‌లో అత‌ని మృత‌దేహాన్ని గుర్తించారు. ర‌ష్య‌న్ ఇంజినీర్ మ‌ర‌ణాన్ని పారాదీప్ పోస్టు ట్ర‌స్టు చైర్మ‌న్ పీఎల్ హ‌రానాథ్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. విచార‌ణ కొన‌సాగుతోంద‌న్నారు.

పారాదీప్ పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్ పిఎల్ హరనాధ్ మాట్లాడుతూ, చీఫ్ ఇంజనీర్ సెర్గీ మిల్యకోవ్ గుండెపోటుతో మరణించారని తెలిసిందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఇవి కూడా చదవండి

ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఓ హోటల్‌లో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు రష్యన్ పౌరులు మరణించిన 10 రోజుల తర్వాత మిల్యకోవ్ మరణించాడు .

నలుగురు రష్యన్ జాతీయులు డిసెంబర్ 21న హోటల్‌లోకి ప్రవేశించారు. 61 ఏళ్ల వ్లాదిమిర్ బిడెనోవ్ ఒక రోజు తర్వాత గుండెపోటుతో మరణించారు. డిసెంబరు 24న పావెల్ ఆంటోవ్ రెండంతస్తుల హోటల్ టెర్రస్ పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం. పోస్ట్‌మార్టంలో అంతర్గత గాయాలతో మృతి చెందినట్లు తేలింది. బిడెనోవ్ శవపరీక్ష అతను గుండెపోటుతో మరణించాడని సూచించింది.

ఎంపీ పావెల్ ఆంటోవ్ హోట‌ల్ గ‌ది నుంచి ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ఆయ‌న ఫ్రెండ్ బిడెనోవ్ కూడా అనుమానాస్ప‌ద రీతిలో చ‌నిపోయాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
టమాటాలతో ఎంపీ జన్మదిన వేడుకలు.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
KGBV పాఠశాలల్లో ప్రవేశాలకు 2026 దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!