AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Emblem Row: అందులో ఎలాంటి పొరపాటు లేదు.. అశోక స్థంభంపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర మంత్రి ధీటైన సమాధానం..

National Emblem Unveiling Row:

National Emblem Row: అందులో ఎలాంటి పొరపాటు లేదు.. అశోక స్థంభంపై వస్తున్న ఆరోపణలకు కేంద్ర మంత్రి ధీటైన సమాధానం..
National Emblem
Sanjay Kasula
|

Updated on: Jul 12, 2022 | 8:43 PM

Share

కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం పైకప్పుపై 6.5 మీటర్ల జాతీయ చిహ్నమైన అశోక స్థూపాన్ని సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రితోపాటు ప్రజాపనుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమయంలో PM మోడీ అశోక స్తంభంతో చిత్రాలకు పోజులిచ్చారు. ఇది సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అయ్యింది. అయితే కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై నిర్మించిన అశోక స్తంభాన్ని చూసిన తర్వాత విపక్షాల నుంచి నిరసన మొదలైంది. కొత్త పార్లమెంట్ భవనం పైకప్పుపై నిర్మించిన అశోక స్థూపాన్ని వ్యతిరేకించడం ద్వారా ప్రధాని మోదీని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయాలు మొదలు పెట్టింది.అయితే ఈ వ్యవహారంపై బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురీ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో వివరణ ఇచ్చారు. ఇలా వరుస ట్వీట్లు చేశారు. వీటిలో జాతీయ చిహ్నం అశోక స్తంభానికి సంబంధించిన కొలతలతోపాటు అన్ని వివరాలను అందించారు.

కేంద్ర హర్దీప్ సింగ్ పూరి తన మొదటి ట్వీట్‌లో ‘అనుపాతం, దృక్పథం’ అనే రెండు అంశాలపై వివరించారు. అందం అనేది చూసేవారి కళ్లలో ఉంటుందని నమ్ముతారు. ప్రశాంతత, కోపం కూడా అంతే.. అసలు #సారనాథ్ #ప్రతిక్ ఎత్తు 1.6 మీటర్లు కాగా, #న్యూ పార్లమెంట్ బిల్డింగ్ పైభాగంలో ఉన్న చిహ్నం 6.5 మీటర్ల ఎత్తులో భారీగా ఉంటుందని పేర్కొన్నారు.

అదే సమయంలో మరో ట్వీట్ చేశారు. ఇందులో, ‘కొత్త భవనంపై అసలు ప్రతిరూపాన్ని ఉంచినట్లయితే.. అది పెరిఫెరల్ పట్టాల వెలుపల కనిపించదు. సారనాథ్‌లో ఉంచిన అసలు విగ్రహం చాలా తక్కువ ఎత్తులో ఉందని, కొత్త చిహ్నం భూమి నుండి 33 మీటర్ల ఎత్తులో ఉందని ‘నిపుణులు’ తెలుసుకోవాలి.

మరోవైపు, కేంద్ర మంత్రి తన మూడవ ట్వీట్‌లో, ‘రెండు నిర్మాణాలను పోల్చేటప్పుడు కోణం, ఎత్తు, స్కేలింగ్.. ఇలా అన్నింటిని తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. సారనాథ్ చిహ్నాన్ని క్రింద నుంచి చూస్తే, వారు చర్చిస్తున్నట్లుగా ప్రశాంతంగా లేదా కోపంగా కనిపిస్తుంది.

దీనితో పాటు, కేంద్ర మంత్రి తన మూడవ, చివరి ట్వీట్‌లో ఇలా వెల్లడించారు. ‘సారనాథ్ చిహ్నాన్ని పెంచినా లేదా పార్లమెంటు కొత్త భవనం, చిహ్నాన్ని ఆ పరిమాణానికి కుదించినా, తేడా ఉండదు’ అని వెల్లడించారు.

జాతీయ వార్తల కోసం..