Road Accident: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు మృతి

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జమ్మూలోని..

Road Accident: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు మృతి
Road Accident
Follow us

|

Updated on: Jul 03, 2021 | 6:49 AM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జమ్మూలోని రాంబన్‌ వద్ద వాహనం  లోయలో పడిపోయింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, రెండు వాహనాలు కూడా వేగంగా ఢీకొనడం వల్లే ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నేషనల్‌ హైవేపై ఓ ప్రైవేటు ప్యాసింజర్‌ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు  తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ కూడా చదవండి

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. సినిమా థియేటర్‌లో చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి 15 ఫైరింజన్లు

Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో విధ్వంసాలు