AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: అటల్‌ సేతును ప్రారంభించిన ప్రధాని.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం.

ఇక ఈ బ్రిడ్జ్‌ని ముంబై ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ నిర్మాణానికి సుమారు రూ. 17,840 కోట్లు ఖర్చైంది. ద‌క్షిణ ముంబై నుంచి న‌వీ ముంబైని ఈ బ్రిడ్జ్ అనుసంధానం చేస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర గంటలు..

PM Modi: అటల్‌ సేతును ప్రారంభించిన ప్రధాని.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం.
Atal Setu
Narender Vaitla
|

Updated on: Jan 12, 2024 | 4:42 PM

Share

దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ బిహారి వాజ్‌పేయి సెవ్రి- న్వశేవ అటల్ సేతు’ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. శుక్రవారం నేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ అద్భుత నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌ పేయి దేశానికి సేవలకు గుర్తుగా ఈ వంతెనకు అటల్‌ సేతు అని నామకరణం చేశారు.

ఇక ఈ బ్రిడ్జ్‌ని ముంబై ట్రాన్స్ హార్బ‌ర్ లింక్ అని కూడా పిలుస్తున్నారు. సుమారు 21.8 కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ నిర్మాణానికి సుమారు రూ. 17,840 కోట్లు ఖర్చైంది. ద‌క్షిణ ముంబై నుంచి న‌వీ ముంబైని ఈ బ్రిడ్జ్ అనుసంధానం చేస్తుంది. ఇప్పటి వరకు రెండున్నర గంటలు పట్టే ప్రయాణ సమాయం ఈ బ్రిడ్జికి అందుబాటులోకి రావడంతో కేవలం 20 నిమిషాలే పట్టడం విశేషం.

ఇక ఈ బ్రిడ్జిని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వాహన దారుల భద్రత కోసం బ్రిడ్జిపై ఏకంగా 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుంది. ఇక ఈ బ్రిడ్జి దక్షిణ ముంబైలోని సెవ్రి నుంచి ప్రారంభమై ఎలిఫెట్ ఐలాండ్‌కు ఉత్తరాన థానే క్రీక్‌ను దాటి న్హావా సమీపంలోని చిర్లే గ్రామంలో ముగుస్తుంది. ముంబయి విమానాశ్రయం, నవీ ముంబయి అంతర్జాతీయ విమానాల మధ్య వేగవంతమైన కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఈ బ్రిడ్జిపై వాహనాలు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లొచ్చు.

ఆకట్టుకుంటోన్న వీడియో..

ఇదిలా ఉంటే అటల్‌ సేతు బ్రిడ్జి ప్రారంభానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ బ్రిడ్జిపై గురువారం రాత్రం ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ రిహార్సల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్‌ సహాయంతో తీసిన వీడియో ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాత్రి పూట విద్యుత్‌ దీపాల వెలుగులో బ్రిడ్జ్‌ అద్భుతంగా కనిపించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
తులం బంగారం ధర రూ.1,20,000కు పడిపోనుందా? బిగ్‌ అప్‌డేట్‌!
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
వాట్సప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
60 ఏళ్లలోనూ మన తాతలు ఉక్కులా.. ఈ స్పాంజి దోసెల వల్లే..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు