AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala New DGP: కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్‌ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్

కేరళ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర డీజీపీగా ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి రవడ చంద్రశేఖర్‌ను నియమించింది. కేరళలో తలస్సేరి ASPగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన 15 సంవత్సరాలుగా IB డిప్యుటేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర డిప్యుటేషన్ నుండి వచ్చి కేరళ DGPగా నియమితులయ్యారు. డీజీపీ పోస్ట్‌ కోసం ఈయనతో పాటు మరో ఇద్దరు రేసులో ఉండగా కేబినెట్‌ చంద్రశేఖర్‌వైపే మొగ్గు చూపింది.

Kerala New DGP: కేరళ కొత్త డీజీపీగా ఏపీ వాసి.. ఛార్జ్‌ తీసుకోనున్న రవడ చంద్రశేఖర్
Kerala New Dgp
Anand T
|

Updated on: Jun 30, 2025 | 2:19 PM

Share

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రవడ చంద్రశేఖర్, కేరళ రాష్ట్ర పోలీసు చీఫ్ (డీజీపీ)గా నియమితులయ్యారు. ఆయన జూన్ 30, 2025న రిటైర్ కానున్న షేక్ దర్వేష్ సాహెబ్ స్థానంలో ఈ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవారు. తలస్సేరి ఏఎస్పీగా తన ఉద్యోగాన్ని ప్రారంభించిన రావాడ చంద్రశేఖర్, వయనాడ్, మలప్పురం, ఎర్నాకులం రూరల్, పాలక్కాడ్ జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా, త్రిస్సూర్, కొచ్చి రేంజ్‌లలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా, అలాగే తిరువనంతపురంలో పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ తర్వాత 15 సంవత్సరాలుగా ఐబీ డిప్యుటేషన్‌పై ఉన్నారు.

ఆ తర్వాత కేంద్రం నుంచి డిప్యూటేషన్‌పై రప్పించిన ప్రభుత్వం రావడ చంద్రశేఖరన్‌ను క్యాబినెట్ సెక్రటేరియట్‌లో కార్యదర్శి (భద్రత)గా నియమించింది. ఇది డిజిపి పదవి కంటే మెరుగైన పదవి. అయితే, ఆయన సర్వీస్‌లో కేవలం ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉండడంతో ఆయనకు దానిని ఎంచుకునే అవకాశం లేదని సమాచారం. అధికారికంగా కేరళ పోలీస్ చీఫ్‌గా నియమిస్తే, రాష్ట్ర డిజిపిలకు కనీసం రెండేళ్ల స్థిర పదవీకాలాన్ని తప్పనిసరి చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.

రవడ చంద్రశేఖర్‌ను డీజీపీగా ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల జరిగిన వర్చువల్ సమావేశంలో సీఎం నేతృత్వంలో జరిగిన కేరళ కేబినెట్‌ ఆమోదించింది. చంద్రశేఖర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) షార్ట్‌లిస్ట్ చేసిన ముగ్గురు అభ్యర్థులలో ఒకరిగా ఎంపిక చేసింది. కాగా డిప్యూటేషన్‌ నుంచి వచ్చిన తర్వాత కేరళ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా రవడ చంద్రశేఖర్ నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.