AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందిర నిర్మాణ శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్. ఈ విషయాన్ని ట్రస్టు..

మందిర నిర్మాణ శంకుస్థాపనకు మోదీకి ఆహ్వానం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 01, 2020 | 7:17 PM

Share

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్. ఈ విషయాన్ని ట్రస్టు వెల్లడించింది. ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్లు ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ తెలిపారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో తక్కువ మంది సమక్షంలోనే రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రామ లల్లాను ఇతర ప్రాంతానికి తరలించి పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. తవ్వకాలు జరుపుతుంటే.. పెద్ద పెద్ద శివ లింగాలు కూడా బయటపడ్డ సంగతి తెలిసిందే.