AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farm Laws: కేంద్రానికి అక్టోబర్ 2 వరకు గడువిచ్చాం.. ఒత్తిడితో చర్చలు జరపలేం: రైతు సంఘం నేత తికాయత్

Farmers protest - Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్..

Farm Laws: కేంద్రానికి అక్టోబర్ 2 వరకు గడువిచ్చాం.. ఒత్తిడితో చర్చలు జరపలేం: రైతు సంఘం నేత తికాయత్
Rakesh Tikait
Shaik Madar Saheb
|

Updated on: Feb 06, 2021 | 3:57 PM

Share

Farmers protest – Chakka Jam: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అక్టోబర్ 2 వరకు సమయమిచ్చామని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ పేర్కొన్నారు. అప్పటివరకు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగుతుందని.. ఆ తర్వాత ప్రణాళికను రచిస్తామని ఆయన స్పష్టంచేశారు. శనివారం నిర్వహించిన చక్కా జామ్ ఆందోళనలో భాగంగా తికాయత్ ఘాజీపూర్ బోర్డర్‌లో మాట్లాడారు. ఆందోళనలు విరమించాలంటూ తమపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వంతో చర్చలు జరపలేమంటూ ఆయన స్పష్టంచేశారు. అక్టోబరు 2 వరకు కేంద్రానికి గడువిచ్చామని.. ఆతర్వాత ప్రణాళిక రచిస్తామని ఆయన తెలిపారు. అయితే ఆందోళన హింసాత్మకంగా మార్చేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని తికాయత్ ఆరోపించారు.

ఇదిలాఉంటే.. శనివారం నిర్వహించిన చక్కా జామ్ నిరసన కార్యక్రమం దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఢిల్లీ శివార్లలోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ సరిహద్దులతోపాటు దేశంలోని పలుచోట్ల రైతులు ఆందోళనలు నిర్వహించారు. ఈ మేరకు ఢిల్లీలో 50వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Also Read:

Chakka Jam: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘చక్కా జామ్’.. పలుచోట్ల కొనసాగుతున్న రైతుల ఆందోళనలు..

పంజాబీ నటుడు దీప్ సిద్దు ఏడీ ? విదేశాల నుంచి ఫేస్ బుక్ లో వీడియోలు నింపుతున్న లేడీ !