Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌ రైలు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

Vande Bharat Express: త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్, మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ కోచ్, వందే భారత్ మెట్రోలను త్వరలో ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. జమ్ము-శ్రీనగర్‌ రైల్వే లైను పనులు వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీనగర్‌ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Vande Bharat: కశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందేభారత్‌ రైలు.. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి
Vande Bharat Trains In Kashmir Soon
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 20, 2023 | 8:57 AM

వందే భారత్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు భారతీయ రైల్వే నిరంతరం కృషి చేస్తోంది. అలాగే, త్వరలో వందే భారత్ స్లీపర్ కోచ్, మెట్రో రైలును ప్రారంభించాలని రైల్వే యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ కోచ్, వందే భారత్ మెట్రోలను త్వరలో ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. జమ్ము-శ్రీనగర్‌ రైల్వే లైను పనులు వేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనే శ్రీనగర్‌ నుంచి వందేభారత్ రైలు పరుగులు పెట్టనుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో రైల్వేలైను విద్యుదీకరణ పనులు పూర్తయిన వెంటనే అక్కడ కూడా వందే భారత్ రైలు దూసుకుపోతుందని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి మొత్తం 75 రైళ్లను పట్టాలు ఎక్కించే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. అలాగే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ప్రత్యామ్నాయంగా సుదూర ప్రాంతాలకు వందే భారత్‌ స్లీపర్‌ వెర్షన్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

జమ్ము నుంచి శ్రీనగర్‌ వరకు రైల్వేలైన్‌ పనులు పూర్తి కాగానే వందేభారత్ రైళ్లు ఆ మార్గంలో రాకపోకలు సాగించే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. అతి త్వరలోనే వందే భారత్ రైళ్లను పట్టాలు ఎక్కిస్తామన్నారు. నూతన రైళ్లను సాంకేతిక నిపుణులు స్పెషల్ డిజైన్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు.. ఎత్తయిన, వివిధ రకాల ఉష్ణోగ్రతలు ఉన్న చోట కూడా సజావుగా రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో, జమ్ము కశ్మీర్‌లో రైల్వే లైన్ల అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగతంగా ఆసక్తి చూపిస్తున్నారని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

దేశంలో మొట్టమొదటి వందే భారత్ స్లీపర్, మెట్రో రైలును..

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను రాయ్ మాట్లాడుతూ, ప్రతిదీ సరిగ్గా జరిగితే, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నమూనా (వందే భారత్ స్లీపర్ రైలు)తో ప్రపంచ స్థాయి సాటిలేని ప్రయాణ అనుభూతిని అందిస్తాము. BEML మొదటి స్లీపర్ వందే భారత్ రైలును అభివృద్ధి చేయడానికి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై మరియు రైల్వే బోర్డుతో కలిసి పనిచేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
ఆ కల్లు షాపు యజమానిని ఎవరు చంపారు? ఓటీటీలో మరో క్రైమ్ థ్రిల్లర్
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
మ్యాంగో సాగులో మనమే టాప్.. రేసులో తెలుగు రాష్ట్రాలు
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు.. ఆస్తుల వివరాలు ఇవే
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
టాస్ గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన బెంగళూరు
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
అబ్బ.. కూల్ న్యూస్.. వచ్చే 3రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
శని, రవుల యుతి.. ఆ రాశుల వారు ఐశ్వర్యవంతులు కాబోతున్నారు..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
మీ మైండ్ షార్ప్ అయితే దాగున్న పిల్లుల్ని కనుక్కోండి చూద్దాం..!
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025 Viral Video: RCB అభిమానులకు ఆటోడ్రైవర్ల బంపర్‌ ఆఫర్‌...
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
IPL 2025: రాజస్థాన్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??
రోజురోజుకు పెరిగిపోతున్న కింగ్‌డమ్‌ హైప్‌.. కారణం అదేనా ??