AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajay Kumar Mishra: మరో వివాదంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. అంటూ మీడియాకు బెదిరింపులు

Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటనపై తాజాగా ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు బాధ్యతగా

Ajay Kumar Mishra: మరో వివాదంలో కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా.. పిచ్చి పిచ్చిగా ఉందా.. అంటూ మీడియాకు బెదిరింపులు
Ajay Kumar Mishra
Shaik Madar Saheb
|

Updated on: Dec 15, 2021 | 6:44 PM

Share

Lakhimpur Kheri Case: ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటనపై తాజాగా ఉభయసభలు అట్టుడుకుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఘటనకు బాధ్యతగా కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రాను కేబినెట్ నుంచి భర్తరఫ్ చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. లఖీంపూర్ ఖేరి కేసులో తన కుమారుడు అడ్డంగా బుక్కయినప్పటికీ కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా తీరు మారడంలేదు. తాజాగా ఆయన మీడియాపై చిందులు వేశారు. ఈ కేసులో కేంద్రమంత్రి కుమారుడు ఆశిశ్ మిశ్రా ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఈ క్రమంలో బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అజయ్‌ మిశ్రా మిడియాను దూషించారు. రైతులపై కావాలనే తన కాన్వాయ్‌ను దూసుకెళ్లించినట్టు సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదికలో వెల్లడించింది. ప్రణాళికాబద్దమైన కుట్రతోనకే ఈ ఘటన జరిగినట్లు దర్యాప్తు బ‌ృందం తెలపడంతో.. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా అసహనానికి గురయ్యారు. ఈ విషయంపై బుధవారం ప్రశ్నలు అడిగిన జర్నలిస్టులను కేంద్రమంత్రి అజయ్ మిశ్రా బండబూతులు తిట్టారు. పిచ్చి పిచ్చిగా ఉందా ? అంటూ ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా. అంతేకాదు ఇక్కడి నుంచి కెమెరాలు బంద్‌ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఘటన తాజాగా సంచలనంగా మారింది.

పిచ్చి పిచ్చిగా ఉందా ? అని ఓ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా. అంతేకాదు ఇక్కడి నుంచి కెమెరాలు బంద్‌ చేసుకొని వెళ్లిపోవాలని ఇతర మీడియా సిబ్బందిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మైండ్‌ ఖరాబయ్యిందా ? .. సిగ్గు లేదా.. అంటూ జర్నలిస్టులను దూషించారు అజయ్‌ మిశ్రా. ఓ దశలో విలేక‌రుల‌పై దూసుకెళ్లేంత ప‌ని చేశారు. ‘మీరంతా దొంగ‌లే’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న ముంద‌స్తు ప్రణాళికతో జ‌రిగిన కుట్రే అని ఆ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న సిట్ తేల్చి చెప్పడంతో రాజ‌కీయంగా పెను దుమారం రేగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రాపై విప‌రీత‌మైన ఒత్తిడి పెరుగుతోంది. ఆయ‌న్ను కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కాంగ్రెస్ స‌హా విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ఈ విష‌యంపై లోక్‌స‌భలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు.

వీడియో..

కేంద్రమంత్రి అజయ్ మిశ్రా లఖీంపూర్ ఖేరి పర్యటనలో అక్టోబర్ 3న.. నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది.

Also Read:

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌కు మరింత ఊరట.. ఆ అవసరం లేదన్న బాంబే హైకోర్టు..

SBI Interest Rate: వినియోగదార్లకు ఎస్బీఐ షాక్.. వడ్డీ రేటును పెంచిన బ్యాంక్.. ఎంత పెరిగిందంటే..

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌