AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Power: పంజాబ్‌లో ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆప్ సర్కారు సంచలన నిర్ణయం

Free power in Punjab: పంజాబ్‌ అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సర్కారు నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆప్ సర్కారు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు.

Free Power: పంజాబ్‌లో ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్.. ఆప్ సర్కారు సంచలన నిర్ణయం
Representative Pic
Janardhan Veluru
|

Updated on: Apr 16, 2022 | 10:51 AM

Share

Free power in Punjab: పంజాబ్‌ అధికార పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) సర్కారు నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆప్ సర్కారు రాష్ట్ర ప్రజలకు తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జులై 1 తేదీ నుంచి ఈ ఉచిత విద్యుత్ పథకం అమలులోకి వస్తుందని ఆ రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అతి త్వరలోనే రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సీఎం భగవత్ మాన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఆప్ చీఫ్, సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో భేటీ అనంతరం ఆయన ఈ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పార్టీ అధికారాన్ని చేపట్టి నెల రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రతి కుటుంబానికి ఇవ్వనున్నట్లు ఆప్ హామీ ఇచ్చింది. ఇప్పుడు ఈ కీలక హామీని నెరవేర్చుతూ పంజాబ్ ప్రజలకు ఆప్ పెను ఊరట కలిగించింది. ఢిల్లీలోనూ ఆప్ సర్కారు ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తోంది.

ప్రతి ఇంటికి రేషన్ సరకులను డెలివరీ చేసేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఇటీవల పంజాబ్ సీఎం భగవత్ మాన్ ప్రకటించారు. ఇది కూడా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 25వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మార్చి 19న జరిగిన కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయించారు.

గత నెల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, శిరోమణి అకాలీదళ్-బహుజన్ సమాజ్‌వాది పార్టీ కూటమి, బీజేపీ – పంజాబ్ లోక్ కాంగ్రెస్-ఎస్ఏడీ(ఎస్) కూటములను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పగ్గాలు కైవసం చేసుకుంది. మొత్తం 117 మంది సభ్యులతో కూడిన పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాల్లో విజయం సాధించగా.. అధికార కాంగ్రెస్ 18 స్థానాలకు పరిమితమయ్యింది.

Also Read..

Rakesh Jhunjhunwala: ఆ కంపెనీలో వాటాలు పెంచుకున్న బిగ్ బుల్ రాకేశ్‌ జున్‌జున్‌వాలా.. మీ దగ్గర కూడా ఈ షేర్ ఉందా..

Beast OTT Release: ఓటీటీ బాట పట్టిన ‘బీస్ట్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..