Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రకు మరింత జోష్.. రాహుల్లో కలిసి అడుగులేస్తున్న ప్రియాంక గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. 78వ రోజు కొనసాగుతున్న యాత్రలో రాహుల్గాంధీతో కలిసి సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అడుగులేస్తున్నారు.
Bharat Jodo Yatra – Madhya Pradesh: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. 78వ రోజు కొనసాగుతున్న యాత్రలో రాహుల్గాంధీతో కలిసి సోదరి ప్రియాంక గాంధీ వాద్రా అడుగులేస్తున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్రలో గురువారం ఉదయం ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి అడుగులేస్తూ.. ప్రియాంక కార్యకర్తల్లో మరింత జోష్ పెంచారు. కాగా.. తమిళనాడు కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కొనసాగి బుధవారం మధ్యప్రదేశ్లోకి అడుగుపెట్టింది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు, పార్టీ వరుస కార్యక్రమాల వల్ల ప్రియాంక గాంధీ ఇంతకాలం భారత్ జోడో యాత్రలో పాల్గొనలేకపోయారు. తాజాగా.. మధ్యప్రదేశ్లో కొనసాగుతున్న యాత్రలో పాల్గొని ప్రియాంక కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపారు.
ఎంపీలో గురువారం బోర్గాన్ గ్రామం నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఖర్గోన్కు వెళ్లే ముందు స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజనుల ఐకాన్ అయిన తాంతియా భీల్ జన్మస్థలాన్ని రాహుల్, కాంగ్రెస్ నేతలు సందర్శించనున్నారు.
ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఆగ్రహం..
బుర్హాన్పూర్లోని ట్రాన్స్పోర్ట్ నగర్లో జరిగిన బహిరంగ ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం, అగ్నివీర్ పథకం, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఎత్తిచూపుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. డీమోనిటైజేషన్, జీఎస్టీ అనేది ఒక విధానం కాదని, అదొక ఆయుధమని, ఇవి చిన్న వ్యాపారులు, రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలను హరించేందుకు ఉపయోగించిన ఆయుధాలంటూ విమర్శించారు. అగ్నివీర్ పథకం ద్వారా ఉద్యోగం పొందిన వారు.. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత నిరుద్యోగులు అవుతారంటూ పేర్కొన్నారు.
#WATCH | Congress party’s Bharat Jodo Yatra resumes from Borgaon, Madhya Pradesh.
This is the 78th day of the Yatra. It will go through 7 districts of the state over the next 10 days.
(Source: AICC) pic.twitter.com/0Mryw1fJe2
— ANI (@ANI) November 24, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం