PM Modi: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ వర్చువల్‌ భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..

PM Modi-Biden meeting: ఉక్రెయిన్‌లో భీకరయుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో వర్చువల్‌గా భేటీ అవుతున్నారు ప్రధాని మోదీ. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు రక్షణ , ఆర్ధిక రంగాల్లో సహకారంపై కూడా ఇద్దరు నేతలు చర్చిస్తారు.

PM Modi: అమెరికా అధ్యక్షుడితో ప్రధాని మోడీ వర్చువల్‌ భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..
Prime Minister Narendra Mod
Follow us

|

Updated on: Apr 10, 2022 | 8:45 PM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో(US President Joe Biden) సోమవారం వర్చువల్‌గా భేటీ అవతున్నారు ప్రధాని మోదీ(PM Modi). ఉక్రెయిన్‌పై భారత్‌ తటస్థ వైఖరితో ఉన్న సమయంలో మోదీ-బైడెన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. పలు అంశాలు ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు. దక్షిణాసియాతో పాటు ఫసిఫిక్‌ ప్రాంతంలో తాజా పరిస్థితిపై చర్చలు జరుపుతారు. అంతర్జాతీయ స్థాయిలో ఇరుదేశాల మధ్య మరింత భాగస్వామ్యం పెరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. రక్షణరంగం , ఆర్ధికరంగాల్లో సహకారంపై కూడా మోదీ-బైడెన్‌ మధ్య చర్చలు జరుగుతాయి. అమెరికా, భారత విదేశాంగశాఖ , రక్షణశాఖ మంత్రుల మధ్య కూడా అతిత్వరలో చర్చలు జరుగుతాయి. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ తమకు చాలా సహకరించిందని తెలిపారు బైడెన్‌. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి ఏర్పాటుకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

రక్షణరంగం , ఆర్ధికరంగాల్లో సహకారంపై కూడా మోదీ-బైడెన్‌ మధ్య చర్చలు జరుగుతాయి. అమెరికా, భారత విదేశాంగశాఖ , రక్షణశాఖ మంత్రుల మధ్య కూడా అతిత్వరలో చర్చలు జరుగుతాయి. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌ తమకు చాలా సహకరించిందని తెలిపారు బైడెన్‌. ఇండో -పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి ఏర్పాటుకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

ఉక్రెయిన్‌ యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీనిపై కూడా ఇద్దరు నేతలు చర్చించబోతున్నారు.

ఇవి కూడా చదవండి: Gudivada Amarnath: కార్పోరేటర్‌ నుంచి మంత్రి వరకు.. విశాఖ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌‌కు జగన్ కేబినెట్‌లో చోటు..

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..