AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..

Chalo Delhi Protest: ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష..

TRS: ఛలో ఢిల్లీ.. టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..
Trs Agitation
Sanjay Kasula
|

Updated on: Apr 10, 2022 | 7:10 PM

Share

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. 1500 ప్రజాప్రతినిధులు స్టేజ్‌పై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణలుఉ ఢిల్లీకి చేరుకున్నాయి. రైతులకు రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కేంద్ర పభ్రుత్వ బాధ్యత అని చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు . తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం కొనసాగాలన్నారు.

జాతీయ స్థాయిలో ఒకే ధాన్యం సేకరణ పాలసీ ఉండాలన్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయం.. విదేశాంగ మంత్రిగా జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు.. 

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం