AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS: “ఛలో ఢిల్లీ..” టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..

Chalo Delhi Protest: ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష..

TRS: ఛలో ఢిల్లీ.. టీఆర్‌ఎస్‌ దీక్షకు అంతా రెడీ.. తెలంగాణ భవన్‌లో భారీ ఏర్పాట్లు..
Trs Agitation
Sanjay Kasula
|

Updated on: Apr 10, 2022 | 7:10 PM

Share

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌(TRS) రైతు దీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తెలంగాణభవన్‌లో సోమవారం దీక్షను చేస్తున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఉదయం 11 గంటలకు దీక్ష ప్రారంభమవుతుంది. 1500 ప్రజాప్రతినిధులు స్టేజ్‌పై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ దీక్షకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌ శ్రేణలుఉ ఢిల్లీకి చేరుకున్నాయి. రైతులకు రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని విమర్శించారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ కేంద్ర పభ్రుత్వ బాధ్యత అని చెప్పారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ‌ రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ విమర్శించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని గత ఆరు నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలో పంటల దిగుబడి రెండు రెట్లు పెరిగిందన్నారు టీఆర్‌ఎస్‌ నేతలు . తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతులు ఢిల్లీ రోడ్లపై ఆందోళనకు సిద్ధమయ్యారని చెప్పారు. ధాన్యం సేకరణపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం కొనసాగాలన్నారు.

జాతీయ స్థాయిలో ఒకే ధాన్యం సేకరణ పాలసీ ఉండాలన్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి. సమాఖ్య స్ఫూర్తిని కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళన చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌లో వేగంగా మారుతున్న రాజకీయం.. విదేశాంగ మంత్రిగా జుల్ఫికర్ అలీ భుట్టో మనవడు.. 

అయ్యో దేవుడా.. ఏం రాత రాశావు.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక..
అయ్యో దేవుడా.. ఏం రాత రాశావు.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..