AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కస్టడీ డెత్‌ కేసులో అరెస్ట్‌.. కరోనాతో మృతి చెందిన పోలీస్‌

తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల(జయరాజ్‌, బెనిక్స్‌) కస్టడీ డెత్‌‌ కేసులో అరెస్టైన స్పెషల్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్

కస్టడీ డెత్‌ కేసులో అరెస్ట్‌.. కరోనాతో మృతి చెందిన పోలీస్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2020 | 3:50 PM

Share

Accused policeman in Tamil Nadu custodial deaths: తమిళనాట సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల(జయరాజ్‌, బెనిక్స్‌) కస్టడీ డెత్‌ కేసులో అరెస్టైన స్పెషల్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ పాల్‌దురై కరోనాతో కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. అయితే సరైన చికిత్స అందించక పోవడం వలనే పాల్‌దురై చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై తూత్తుకుడి జిల్లాలో జయరాజ్‌, బెన్సిక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారిని స్టేషన్‌కి తీసుకెళ్లి చిత్రవధ చేయగా.. వారిద్దరు మరణించారు. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సర్కారు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దీనిపై విచారణ జరిపిన సంస్థ సత్తాన్‌కులం పోలీస్‌ స్టేషన్‌కి చెందిన 10 మంది పోలీసు అధికారులను అరెస్టు చేసింది. అందులో పాల్‌దురై కూడా ఉన్నారు.

Read This Story Also: నాకు ఇంకో జాబ్‌ ఏమైనా ఉందా!