AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో 5 దేశాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. ముఖ్య లక్ష్యం అదే!

మరో నాలుగు దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు గురువారం (జూన్ 26) ఈ సమాచారాన్ని అందించారు. బ్రెజిల్‌తో పాటు, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారని తెలిపారు.

మరో 5 దేశాలను సందర్శించనున్న ప్రధాని మోదీ.. ముఖ్య లక్ష్యం అదే!
Pm Narendra Modi Attend Bricks
Balaraju Goud
|

Updated on: Jun 27, 2025 | 9:29 AM

Share

మరో నాలుగు దేశాలతో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. ఈ టూర్‌లో భాగంగా బ్రెజిల్‌లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు గురువారం (జూన్ 26) ఈ సమాచారాన్ని అందించారు. బ్రెజిల్‌తో పాటు, ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాలను ప్రధాని మోదీ సందర్శిస్తారని తెలిపారు.

అయితే, ప్రస్తుతానికి ప్రధాని మోదీ ప్రతిపాదిత పర్యటన గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పర్యటనలో ప్రధాన దృష్టి జూలై 6 – 7 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనున్న బ్రెజిల్ నగరమైన రియో ​​డి జనీరో పర్యటన‌పైనే ఉంది. బ్రిక్స్ అనేది ప్రపంచంలోని 11 ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం. ఇందులో ప్రపంచ జనాభాలో దాదాపు 49.5 శాతం, జిడిపిలో దాదాపు 40 శాతం. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 26 శాతం ఉన్నాయి.

బ్రిక్స్‌లో మొదట బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. 2024 లో దీనిని ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేర్చడానికి విస్తరించారు. ఇండోనేషియా 2025 లో బ్రిక్స్ గ్రూప్ చేరనుంది. ఈ బృందం శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ఆసక్తులు, ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం సహా అనేక అంశాలను చర్చించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. గ్లోబల్ సౌత్ అనే పదాన్ని సాధారణంగా ఆర్థికంగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలను సూచించడానికి ఉపయోగిస్తారు.

ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యంగా కృషి చేయాలని భారత్ పిలుపునిస్తోంది. బ్రెజిల్ ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాతో కూడా విస్తృత చర్చలు జరపనున్నట్లు సమాచారం. బ్రెజిల్‌లో మోదీ పర్యటనను కొనసాగించాలని భారత పక్షం నిర్ణయించింది. అదే సమయంలో, గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను పెంచుకునే భారతదేశం ప్రయత్నాల్లో భాగంగా, ప్రధాని మోదీ ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, ఘనా, నమీబియాలను సందర్శిస్తారు. అదే సమయంలో, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడంలేదని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..