AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: 2013లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది: ప్రధాని మోదీ

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సామాజిక న్యాయం అందించడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా ముస్లిం మహిళల హక్కులు రక్షించినట్లు, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు..

PM Modi: 2013లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చింది: ప్రధాని మోదీ
Subhash Goud
| Edited By: |

Updated on: Apr 14, 2025 | 8:52 PM

Share

వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం హర్యానాలోని హిసార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ కాంట్రాక్టులలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ గురించి మాట్లాడారు. కర్ణాటకలో ముస్లింలకు OBC రిజర్వేషన్ కల్పించామని అన్నారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను తొలగించి ముస్లింలకు ఇచ్చారని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు మోసపోతున్నారన్నారు. రాజ్యాంగాన్ని అవమానించారని, కాంగ్రెస్ అంబేద్కర్‌పై దాడి చేస్తోందని దుయ్యబట్టారు.

ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వక్ఫ్ సవరణ బిల్లును సమర్థించారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా సామాజిక న్యాయం అందించడానికి తాము కృషి చేస్తున్నామని మోదీ అన్నారు. వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా ముస్లిం మహిళల హక్కులు రక్షించినట్లు, వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. ఓటు బ్యాంకుల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చారని, వక్ఫ్ పేరుతో భూమిని లాక్కుంటున్నారని, వక్ఫ్ భూ మాఫియా పేదల భూమిని దోచుకుంటోందని మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఓటు బ్యాంకు రాజకీయాలు:

2013లో ఎన్నికల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చిందని, రాజ్యాంగపరమైన చిక్కులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సవరణను తొందరపాటుతో చేశారని మోదీ ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ వక్ఫ్ చట్టాన్ని మార్చి బాబా సాహెబ్ సృష్టించిన రాజ్యాంగం కంటే దానిని ఉన్నతమైనదిగా అభివర్ణించిందని, ఇది బాబాసాహెబ్‌కు జరిగిన ఘోర అవమానమని మోదీ వ్యాఖ్యానించారు. వాళ్ళు తమ టిక్కెట్లలో 50 శాతం ముస్లింలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వారికి నిజంగా ముస్లింల పట్ల సానుభూతి ఉంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముస్లింను ఎందుకు నియమించదని మోదీ ప్రశ్నించారు.

వక్ఫ్ బోర్డు అసలు ఉద్దేశ్యాన్ని వివరిస్తూ, పేదలు, అణగారిన ముస్లింలు, ముఖ్యంగా మహిళల అభ్యున్నతి దీని లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని ఎత్తిచూపి వేలాది మంది ముస్లిం మహిళలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, దీని ఫలితంగా చట్టానికి సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కె. జయప్రకాష్ హెగ్డే నేతృత్వంలోని కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి ముస్లింలు, లింగాయత్‌లు, వెనుకబడిన దిగువ కులాలతో సహా వెనుకబడిన తరగతుల జాబితాలోని వివిధ కులాలకు రిజర్వేషన్లను తిరిగి వర్గీకరించడం ద్వారా ప్రస్తుత రిజర్వేషన్ మొత్తాన్ని పెంచాలని సిఫార్సు చేసిందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి