AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గత ఏడాది చిన్నారులతో.. ఈ ఏడాది ఐక్యతా చిహ్నం వద్ద..

ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిన రోజును సొంత రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. గత ఏడాది ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో స్కూలు విద్యార్ధుల సమక్షంలో గడిపారు. ఈ ఏడాది మాత్రం గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శిస్తూ గడిపారు. నర్మదా నది మధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐరన్ విగ్రహం ఐక్యతా చిహ్నం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్దకు ఆయన ఈ ఉదయాన్నే చేరుకున్నారు. ముందుగా ఆయన హెలీకాప్టర్ నుంచి విగ్రహాన్ని […]

గత ఏడాది చిన్నారులతో.. ఈ ఏడాది ఐక్యతా చిహ్నం వద్ద..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 17, 2019 | 12:31 PM

Share

ప్రధాని నరేంద్రమోదీ తన పుట్టిన రోజును సొంత రాష్ట్రంలో జరుపుకుంటున్నారు. గత ఏడాది ఆయన తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో స్కూలు విద్యార్ధుల సమక్షంలో గడిపారు. ఈ ఏడాది మాత్రం గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శిస్తూ గడిపారు. నర్మదా నది మధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అతి ఎత్తైన ఐరన్ విగ్రహం ఐక్యతా చిహ్నం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) వద్దకు ఆయన ఈ ఉదయాన్నే చేరుకున్నారు. ముందుగా ఆయన హెలీకాప్టర్ నుంచి విగ్రహాన్ని చూశారు. గత ఏడాది అక్టోబర్ 31న పటేల్ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.

గుజరాత్ నర్మదా నదీ తీరంలో ఉన్న కేవడియా ప్రాంతంలో పటేల్ విగ్రహాన్ని దాదాపు రూ.4 వేలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సందర్భంగా మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ అక్కడ పర్యటించారు. కేవడియా జంగిల్ సఫారీ ప్రాంతంలో కాక్టస్ గార్డెన్‌లో మోదీ ప్రకృతి అందాలను వీక్షించారు.

సోమవారం రాత్రే ప్రధాని గుజరాత్‌కు చేరుకున్నారు. ఈ ఉదయం ఆయన నర్మదా జిల్లాలో ఉన్న కెవాడియాకు వెళ్లారు. ఈ సందర్భంగా నర్మదా నదిలో నిర్మాణమైన సర్ధార్ పటేల్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ యునిటీతో పాటు పలు అంశాలపై సమీక్ష జరిపారు. నమామి నర్మదే మహోత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నర్మదా ప్రాజెక్టు ద్వారా 131 అర్బన్ సెంటర్లలతో పాటు 9,633 గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. అదేవిధంగా 15 జిల్లాల్లో 18.54 హెక్టార్లకు అంటే 3,112 గ్రామాలకు సాగునీరు అందుతుంది.