AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశంలో తయారు చేసే ప్రతిదీ, ప్రపంచం కోసమే అయ్యి ఉండాలిః ప్రధాని మోదీ

కాలక్రమేణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. ఇంతలో, 2026 ఫిబ్రవరిలో భారతదేశంలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం (జనవరి 08) ఉదయం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో భారత AI స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

భారతదేశంలో తయారు చేసే ప్రతిదీ, ప్రపంచం కోసమే అయ్యి ఉండాలిః  ప్రధాని మోదీ
PM chairs the Roundtable with Indian AI Start-Ups
Balaraju Goud
|

Updated on: Jan 08, 2026 | 4:07 PM

Share

కాలక్రమేణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతోంది. ఇంతలో, 2026 ఫిబ్రవరిలో భారతదేశంలో AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం (జనవరి 08) ఉదయం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో భారత AI స్టార్టప్‌లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో మనదేశంలో జరగనున్న ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కి ముందు, సమ్మిట్‌లో AI for ALL: గ్లోబల్ ఇంపాక్ట్ ఛాలెంజ్‌కు అర్హత సాధించిన 12 భారతీయ AI స్టార్టప్‌లు రౌండ్‌టేబుల్‌కు హాజరయ్యాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తమ ఆలోచనలను, పనిని ప్రదర్శించాయి.

ఈ స్టార్టప్‌లు భారతీయ భాషా ఫౌండేషన్ మోడల్‌లు, బహుభాషా LLMలు, స్పీచ్-టు-టెక్స్ట్, టెక్స్ట్-టు-ఆడియో, టెక్స్ట్-టు-వీడియో వంటి విభిన్న రంగాలలో పనిచేస్తున్నాయి. ఇ-కామర్స్, మార్కెటింగ్, వ్యక్తిగతీకరించిన కంటెంట్ సృష్టి కోసం జనరేటివ్ AIని ఉపయోగించి 3D కంటెంట్; పరిశ్రమలలో డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడానికి ఇంజనీరింగ్ సిమ్యులేషన్‌లు, మెటీరియల్ పరిశోధన, అధునాతన విశ్లేషణలు, ఆరోగ్య సంరక్షణ, వైద్య పరిశోధన, ఇతర వాటితో సహా పలు స్టారప్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఈ AI ఇంపాక్ట్ 2026 సమ్మిట్‌లో దాదాపు 15 దేశాల నుండి 100 మందికి పైగా ప్రపంచ CEOలు, దేశాధినేతలు పాల్గొంటారు. ఈ సమ్మిట్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం గురించి చర్చించనున్నారు. ఫిబ్రవరి 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు CEOలతో సమావేశం కూడా జరుగుతుంది. శిఖరాగ్ర సమావేశానికి ముందు, ఫిబ్రవరి 18న ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఆతిథ్యం ఇచ్చే విందు జరుగుతుంది. దీనికి పాల్గొనే అనేక దేశాల దేశాధినేతలు, నాయకులు హాజరవుతారు.

ఈ నేపథ్యంలోనే సమ్మిట్ ఏర్పాట్లపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దేశంలో కృత్రిమ మేధస్సు పర్యావరణ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో భారతదేశం బలమైన నిబద్ధతను AI స్టార్టప్‌లు ప్రశంసించాయి. AI రంగం వేగవంతమైన వృద్ధి, విస్తారమైన భవిష్యత్తు సామర్థ్యాన్ని ప్రధాని మోదీకి వివరించారు. కృత్రిమ మేధస్సు ఆవిష్కరణ, విస్తరణ గురుత్వాకర్షణ కేంద్రం భారతదేశం వైపు మారడం ప్రారంభించిందని పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు AI అభివృద్ధికి బలమైన, అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుందని, దేశాన్ని ప్రపంచ AI పటంలో దృఢంగా ఉంచుతుందని స్టార్టప్ సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. సమాజంలో పరివర్తన తీసుకురావడంలో కృత్రిమ మేధస్సు ప్రాముఖ్యతను తెలియజేశారు. వచ్చే నెలలో భారతదేశం ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను నిర్వహిస్తుందని, దీని ద్వారా దేశం సాంకేతిక రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం AIని ఉపయోగించుకుని పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు.

భారతదేశ భవిష్యత్తుకు స్టార్టప్‌లు, AI వ్యవస్థాపకులు సహ నిర్మాతలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కొత్త ఆవిష్కరణలు, పెద్ద ఎత్తున అమలు రెండింటికీ దేశం అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు. “భారతదేశంలో తయారు చేసే ప్రతిదీ, ప్రపంచం కోసమే అయ్యి ఉండాలి” అనే స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన AI నమూనాను భారతదేశం ప్రపంచానికి అందించాలని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశంపై ప్రపంచం ఉంచిన నమ్మకమే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి అన్నారు. భారతీయ AI నమూనాలు నైతికంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా, డేటా గోప్యతా సూత్రాలపై ఆధారపడి ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. భారతదేశం నుండి ప్రపంచ నాయకత్వం కోసం స్టార్టప్‌లు పనిచేయాలని, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సరసమైన AI, సమ్మిళితమై AI, పొదుపు ఆవిష్కరణలను ప్రోత్సహించగలదని ఆయన అన్నారు. భారతీయ AI నమూనాలు విభిన్నంగా ఉండాలని, స్థానిక, స్వదేశీ కంటెంట్, ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలని కూడా ప్రధాని మోదీ సూచించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సమావేశంలో అవతార్, భారత్‌జెన్, ఫ్రాక్టల్, గాన్, జెన్లూప్, గ్నాని, ఇంటెల్లిహెల్త్, సర్వమ్, శోధ్ AI, సోకెట్ AI, టెక్ మహీంద్రా, జెంటీక్ వంటి భారతీయ AI స్టార్టప్‌ల CEOలు, అధిపతులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద కూడా పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
Horoscope Today: ఆ రాశి వ్యాపారులకు లాభాలే లాభాలు..
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?