PM Modi: చైనాకు చెక్.. ఇండోనేషియాలో మోదీ టూర్.. బ్రహ్మోస్ డీల్తో పాటు కీలక ఒప్పందాలు..
భారత వ్యూహాత్మక, దౌత్య చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు బ్రేకులు వేస్తూ.. రక్షణ, ఆర్థిక రంగాల్లో భారత్ పట్టు సాధించేలా మోదీ మూడు దేశాల పర్యటన సాగనుంది. ముఖ్యంగా వేల కోట్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణుల డీల్, సబాంగ్ పోర్ట్ ఉమ్మడి అభివృద్ధి వంటి 5 భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాలు పర్యటనలో భాగంగా మొదటి విడతగా ఇండోనేషియా చేరుకున్నారు. జకార్తా చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో పాటు ఆ దేశ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య జూలై 11 వరకు సాగనున్న ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి ఉంది. భారతదేశ దౌత్య, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలలో ఈ పర్యటన అత్యంత కీలక పాత్ర పోషించనుంది. ఆరు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రధాని మోదీ దౌత్యపరమైన చర్చలు, వాణిజ్య ఒప్పందాలు, ప్రవాస భారతీయుల సమావేశాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఇండోనేషియా పర్యటనలో రక్షణ, సాంకేతిక మౌలిక సదుపాయాల రంగాలలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కొన్ని అతిపెద్ద ఒప్పందాలు జరగనున్నాయి.
మోదీకి అరుదైన గౌరవం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఇండోనేషియా అత్యున్నత గౌరవమైన బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మోదీకి ప్రదానం చేశారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు స్వయంగా వెల్లడించారు.
బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు విస్తరణ
దేశ రక్షణ ఎగుమతుల్లో ఇండోనేషియాతో జరగబోయే ఒప్పందం అత్యంత కీలకమైనది. ఇండోనేషియా తన రక్షణ వ్యవస్థను అనుసంధానం భారతదేశం నుండి రూ. 2,500 కోట్లు విలువైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమైంది. ఈ పర్యటనలో ఈ డీల్ మరింత ముందుకు సాగడమే కాకుండా ఇండోనేషియా తన బ్రహ్మోస్ ఇన్వెంటరీని విస్తరించాలని నిర్ణయించింది. దీనికోసం మరిన్ని మిస్సైల్ బ్యాటరీలను సరఫరా చేయడం ద్వారా భారత్ రక్షణ సహకారాన్ని అందించనుంది. ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేస్తున్న రెండో ఆసియా దేశంగా ఇండోనేషియా నిలవనుంది.
భారత్ అస్త్ర క్షిపణుల దిగుమతి
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత వైమానిక దళం యొక్క ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ పవర్ నిరూపితమైన సంగతి తెలిసిందే. ఈ విజయవంతమైన ట్రాక్ రికార్డ్ను చూసి ప్రభావవంతమైన ఇండోనేషియా.. భారతదేశం స్వదేశీంగా తయారు చేసిన అస్త్ర క్షిపణులను కూడా దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది.
సబాంగ్ పోర్ట్ సంయుక్త అభివృద్ధి
వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా అత్యంత కీలకమైన సబాంగ్ పోర్ట్ను భారత్, ఇండోనేషియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. మలక్కా జలసంధి కి ముఖద్వారంగా ఉండే ఈ పోర్ట్.. భారతదేశపు ప్రతిష్టాత్మక గ్రేట్ నికోబార్ పోర్ట్ ప్రాజెక్ట్కు కేవలం 100 మైళ్ల దూరంలోనే ఉంది. ఈ పోర్ట్ వల్ల మహాసముద్రంలో చైనాకు అడ్డుకట్ట వేయడానికి అభివృద్ధి హిందూ నిపుణులు.
కీలక ఖనిజాల మైనింగ్, స్టీల్ తయారీలో పెట్టుబడులు
గ్లోబల్ సప్లై చైన్ను బలోపేతం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. ఇండోనేషియాలో అత్యంత విలువైన వస్తువులు, నికెల్, అరుదైన ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీ రంగాల్లో భారతదేశం భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరనుంది.
భారత EVM లపై ఇండోనేషియా ఆసక్తి
భారతదేశ ఎన్నికల నిర్వహణ తీరు, సాంకేతికతకు ప్రపంచ గుర్తింపు లభిస్తోంది. ఇందులో భాగంగానే భారతదేశ ఎన్నికల మోడల్ను ప్రశంసించిన ఇండోనే.. తమ దేశానికి ప్రత్యేకంగా సరిపోయే భారతదేశ ఎలక్ట్రానిక్ సాంకేతిక ఓటింగ్ యంత్రాల అభివృద్ధి కోసం సహాయాన్ని కోరింది. దీనికి భారత్ పూర్తి మద్దతు ప్రకటించింది.
