PM Kisan Scheme: రైతులకు అలర్ట్.. ఆ వివరాలు పూర్తిచేయకుంటే డబ్బులు రావు.. రెండు రోజులే ఛాన్స్..

రైతులకు ముఖ్య సూచన. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. లేకుంటే..

PM Kisan Scheme: రైతులకు అలర్ట్.. ఆ వివరాలు పూర్తిచేయకుంటే డబ్బులు రావు.. రెండు రోజులే ఛాన్స్..
Pm Kisan
Follow us

|

Updated on: Mar 29, 2022 | 9:15 AM

రైతులకు ముఖ్య సూచన. మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మార్చి 31లోగా e-KYC వివరాలను నమోదు ప్రధానమంత్రి కిసాన్ యోజన (PM Kisan Scheme)కింద 10వ విడత రైతుల ఖాతాలో జనవరి 1, 2022న విడుదల చేయబడింది. అయితే.. ఇప్పుడు 11వ విడత కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో ఏటా రూ.6000 జమచేస్తుంది. రైతులకు నాలుగు నెలలకే అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా అందజేస్తారు. పీఎం కిసాన్ యోజన కింద 11వ విడత ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయవచ్చు. ఈలోగా మార్చి 31 వరకు రైతులకు అవసరమైన పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఈ పనిని పూర్తి చేయకపోతే, మీరు ఇప్పుడే పూర్తి చేయాల్సి ఉంది. అనర్హులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం e-KYCని తప్పనిసరి చేసింది. పీఎం కిసాన్ యోజన పోర్టల్‌లో రైతులకు ఇ-కెవైసి అవసరమని.. త్వరగా పూర్తి చేయాలని కూడా సమాచారం అందించబడింది. అయితే, e-KYC కోసం గడువు ఇక్కడ నుంచి ముగింపు దశకు చేరుకుంది. KYC లేకుంటే మీకు 11వ విడత పీఎం కిషన్ యోజన పథకం నుంచి వచ్చే డబ్బులు నిలిచిపోతాయి.

అయితే ఇప్పటి వరకు కూడా మీరు e-KYC పూర్తి చేయకుండా ఉంటే వెంటనే ఈ పని పూర్తి చేయండి. ఇలా చేయడం వల్ల మీకు 11 వ విడత పీఎం కిషన్ యోజన డబ్బులు వచ్చే నెలలో మీ ఖాతాలో జమ కానున్నాయి. అయితే మీరు నమోదు చేయడం మరిచిపోతే వెంటే ఇలా చేయండి..

e-KYC చేసే విధానాన్ని తెలుసుకోండి

  1. e-KYC పూర్తి చేయడానికి మీరు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
  2. ఇక్కడ ekyc ఎంపిక మునుపటి మెనును కనిపిస్తుంది.
  3. e-KYC ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొత్త పేజీ తెరుచుకుంటుంది .
  4. ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
  5. దీని తర్వాత మీరు ఇమేజ్ కోడ్‌ను నమోదు చేసి సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
  6. ఆ తర్వాత మొబైల్ నంబర్ మరియు OTPని నమోదు చేయండి.
  7. సమర్పించిన తర్వాత, వివరాలు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి, ఆపై మీ eKYC ప్రక్రియ పూర్తవుతుంది.
  8. సమాచారం సరిగ్గా లేకుంటే రాంగ్ ఎంట్రీగా పేర్కొంటుంది.
  9. ఆ తర్వాత మీరు సేవా కేంద్రానికి వెళ్లి.. తద్వారా ఆధార్ కార్డును సరిదిద్దవచ్చు.

డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయంటే..

అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఏటా రూ.6 వేలు అందిస్తారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదిలో మొత్తంగా మూడు సార్లు ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరంలో తొలి విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి జూలై 31లోపు రైతులకు చేరతాయి. ఎప్పుడైనా ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చు. రెండో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 30లోపు రైతుల బ్యాంక్ ఖాతాలలోకి చేరతాయి. అదేమసయంలో మూడో ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు డిసెంబర్ 1 నుంచి మార్చి 31లోపు ఎప్పుడైనా రావొచ్చు. ఇలా మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ. 6 వేలు అన్నదాతల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతున్నాయి.

స్కీమ్ ప్రత్యేకతలు

  1.  పీఎం కిసాన్ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తోంది. అంటే 100 శాతం డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచే నేరుగా రైతులకు చేరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేదు.
  2.  2018 డిసెంబర్ 1 నుంచి పీఎం కిసాన్ పథకం అమలులోకి వచ్చింది.
  3.  ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రైతులకు రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.6 వేలు లభిస్తున్నాయి.
  4.  ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.
  5.  పీఎం కిసాన్ స్కీమ్‌కు ఎవరు అర్హులు అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాతలకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.
  6.  ఈ పథకం కింద డబ్బులు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి.

ఇవి కూడా చదవండి: Gangster Naeem: గ్యాంగ్​స్టర్​ నయీం బినామీల ఆస్తులపై ఐటీ శాఖ నజర్‌.. 150 కోట్ల విలువైన ఆస్తులు సీజ్‌..

ఈ ఫోటోలో ఎన్ని చిత్రాలు ఉన్నాయో గుర్తుపట్టండి చూద్దాం.. మీరు మొదట చూసేదే మీ వ్యక్తిత్వం..