AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం.. ఆత్మకు శాంతి..! శుభం ద్వివేది భార్య భావోద్వేగం..

26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. పహల్గాం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశన్య ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు.

Operation Sindoor: ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం.. ఆత్మకు శాంతి..! శుభం ద్వివేది భార్య భావోద్వేగం..
Ashanya Dwivedi
Jyothi Gadda
|

Updated on: May 07, 2025 | 10:19 AM

Share

పహల్‌గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది భార్య ఐశన్య ద్వివేది భావోద్వేగంగా స్పందించారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై జరిగిన దాడి ఓ సాధారణ ప్రతీకారం కాదని, అది తన భర్తకు అర్పించిన ఘన నివాళి అని అన్నారు. ప్రధాని మోదీ తమ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘ఇది నా భర్త త్యాగానికి నిజమైన గౌరవం. ఆయన ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందనే నమ్మకం ఉందన్నారు. నా భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకున్నందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు అంటూ భారత సైన్యాన్ని ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడిలో ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన శుభం ద్వివేది ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య ఐశన్య ద్వివేది ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

శుభం ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది మాట్లాడుతూ, భారత సైన్యం తీసుకున్న చర్య దేశ ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించిందని అన్నారు. భారత సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాము అంటూ చెప్పారు. దేశ ప్రజల బాధల్ని విన్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.. పాకిస్తాన్‌లో విజృంభిస్తున్న ఉగ్రవాదాన్ని భారత సైన్యం ఎలా నాశనం చేసిందో, దానికి తమంతా మన సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను… ఈ వార్త విన్నప్పటి నుండి మా కుటుంబం మొత్తం ప్రశాంతంగా ఉందని శుభం తండ్రి అన్నారు. శుభం ద్వివేది బంధువు మనోజ్ ద్వివేది మాట్లాడుతూ, బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని అన్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

26 మంది అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత భారత ఆపరేషన్ సింధూర్‌ పేరిట పాక్‌ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఈ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
రోహిత్ శర్మ vs క్రిస్ గేల్: టీ20 తోపు ఓపెనర్‌ ఎవరు..? కోహ్లీ..
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
లవర్‌ కోసం భార్యకి స్కెచ్.. ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
సీజన్‌ అయిపోతుంది? ఈ పూలు ఎక్కడ కనిపించినా వదలకుండా తెచ్చేసుకోండి
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
కర్రీ చేసేముందు చికెన్ కడుగుతున్నారా.. ఏమవుతుందో మీకు తెలుసా..?
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
ఫిల్మ్‌నగర్‌లో BMW బీభత్సం.. దెబ్బకు ఊడిన ముందుటైర్
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..
నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. సంపాదన ఇదే.. జబర్దస్త్ నరేష్..
ఫోన్ పక్కన పడేయ్.. అభిషేక్ కు గంభీర్ ఇచ్చిన 'వార్నింగ్' ఇదే
ఫోన్ పక్కన పడేయ్.. అభిషేక్ కు గంభీర్ ఇచ్చిన 'వార్నింగ్' ఇదే
పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
పడిపోయిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే..
సాఫ్ట్ వేరోళ్లకు పోటీగా..ఈ ఆటో డ్రైవరన్న నెలకు ఎంత సంపాదిస్తాడంటే
సాఫ్ట్ వేరోళ్లకు పోటీగా..ఈ ఆటో డ్రైవరన్న నెలకు ఎంత సంపాదిస్తాడంటే
రొనాల్డోను తలపించిన మనీషా షాట్.. 30 గజాల దూరం నుంచి మెరుపు గోల్
రొనాల్డోను తలపించిన మనీషా షాట్.. 30 గజాల దూరం నుంచి మెరుపు గోల్