ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. శరీరంపై 14 చోట్ల గాయాలు..!

Kolkata Doctor Rape Murder: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభయ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై 14 చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిపారు. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, మర్మాంగాలపై ఈ గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. శరీరంపై 14 చోట్ల గాయాలు..!
Kolkata doctor's autopsy report
Follow us

|

Updated on: Aug 19, 2024 | 4:50 PM

Kolkata Doctor’s Autopsy Report: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అభయ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై 14 చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిపారు. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, మర్మాంగాలపై ఈ గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొనఊపిరితో ఉన్నప్పుడు అభయపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్థారించారు. శరీరంపై పలుచోట్ల పంటి గాట్లు, గోళ్ల గీతలు ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు. ఆహారంలో మత్తుమందు కలిపారా లేదా అనే దానిపై ఫోరెన్సిక్‌ నివేదిక తర్వాత స్పష్టత వస్తుందన్న వైద్యులు తెలిపారు. అభయకు ఎముకలు విరిగినట్లు నిర్థారణ కాలేదని వెల్లడించారు. అలాగే మృతురాలి శరీరంలో పలుచోట్ల రక్తం గడ్డకట్టడంతో పాటు ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కనిపించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. బాధితురాలిని అత్యంత క్రూరంగా మానవ మృగం అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక నిర్థారిస్తోంది.

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్.. ఆగస్టు 9న హత్యాచారానికి గురికావడం తెలిసిందే. ఆ రోజున మెడికల్ కాలేజీలోని చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. మరో నిర్భయ ఘటన తరహాలో ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అత్యంత సున్నితమైన ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ను నాలుగోసారి ప్రశ్నించింది. నలుగురు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌ను కూడా విచారించింది. ఇక సీబీఐ మహిళా ఆఫీసర్ నిందితుడి ఇంటికి వెళ్లి విచారించారు. నిందితుడికి సైకాలజీ టెస్ట్ చేయాలని భావిస్తోంది సీబీఐ. హత్యాచార ఘటన జరిగిన స్పాట్‌కు వెళ్లి అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు.

అటు కోల్‌కతా ఘటనను సుమోటో కేసుగా సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 20న విచారణ జరపనుంది. మంగళవారంనాటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి రూలింగ్ ఇవ్వనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం