AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్పీకర్‌ ఓంబిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు అందజేత!

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్‌, డీఎంకే, ఎస్పీ సహా మొత్తం 118 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు. విపక్షాలకు స్పీకర్‌ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

స్పీకర్‌ ఓంబిర్లాపై కాంగ్రెస్‌ అవిశ్వాస తీర్మానం.. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు అందజేత!
Om Birla No Confidence Motion
Anand T
|

Updated on: Feb 10, 2026 | 2:54 PM

Share

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ రూల్‌ 94 సీ కింద స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని. దానిపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా ఇతర పార్టీలకు చెందిన మొత్తం 120 మంది ఎంపీలు సంతకాలు చేశారని.. విపక్ష పార్టీల నేతలు, రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ ఎంపీలు పదే పదే అడ్డుతగుతున్నారని కాంగ్రెస్‌ ఎంపీలు ఆరోపించారు. బీజేపీ సభ్యులు సభలో బండబూతులు మాట్లాడుతున్నప్పటికి మైక్‌ కట్‌ చేయడం లేదని అన్నారు.

ఇక విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులను పరిశీలించాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ను స్పీకర్‌ ఆదేశించారు. మరోవైపు విపక్షాల అవిశ్వాస తీర్మానానికి టీఎంసీ మద్దతుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. స్పీకర్‌కు మూడు రోజుల సమయం ఇవ్వాలని, తరువాత అవిశ్వాస తీర్మానం గురించి ఆలోచించాలని టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ అన్నారు. స్పీకర్‌కు తమ డిమాండ్లపై కాంగ్రెస్‌ లేఖ రాయాలని సూచించారు.

అయితే స్పీకర్ పై అవిశ్వాసానికి 273 మంది లోక్ సభ సభ్యుల మద్దతు తప్పనిసరి అవసరం- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(c), లోక్ సభ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ రూల్ 200 ప్రకారం అవిశ్వాస ప్రక్రియ ఉంటుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందాలంటే లోక్‌సభ సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. నోటీసు అందిన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించే మోషన్‌ను లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో చేర్చనున్నారు స్పీకర్. నోటీసు అందిన తేదీ నుంచి కనీసం14 రోజుల తర్వాతే ప్రక్రియ జరుగుతుంది. స్పీకర్ అవిశ్వాస తీర్మానం చర్చకు డిప్యూటీ స్పీకర్ సభాద్యక్షత వహిస్తారు. అవిశ్వాస తీర్మానంపై స్పీకర్‌కు మాట్లాడే హక్కు ఉంటుంది. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు కూడా స్పీకర్‌కు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.