AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Sindoor: టెర్రరిస్టుల్లో ‘టెర్రర్’ పుట్టించిన భారత్.. మెరుపు దాడులు చేసిన ప్రాంతాలివే..

ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయ్‌. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ కొనసాగుతున్నాయ్‌. ఇందులో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయూద్ కంచుకోట మురిడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లోని 2 ప్రాంతాలు..

Operation Sindoor: టెర్రరిస్టుల్లో 'టెర్రర్' పుట్టించిన భారత్.. మెరుపు దాడులు చేసిన ప్రాంతాలివే..
Operation Sindoor
Ravi Kiran
|

Updated on: May 07, 2025 | 11:58 AM

Share

ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రస్థావరాలే టార్గెట్‌గా ఇండియన్‌ ఆర్మీ దాడులు కొనసాగుతున్నాయ్‌. పాకిస్తాన్‌లో 4.. పీవోకేలో 5 చోట్ల ఎటాక్స్‌ కొనసాగుతున్నాయ్‌. ఇందులో ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయూద్ కంచుకోట మురిడ్కే కూడా ఉంది. ముజఫరాబాద్‌లోని 2 ప్రాంతాలు, కోట్లీ, గుల్పూర్, భీంబర్, సియాల్‌కోట్, చక్రంబూ, మురిడ్కే, బహ్వల్పూర్‌లోని టార్గెట్స్‌ను ఆర్మీ చేధించింది. జైషే మహ్మద్, లష్కరే ఉగ్రసంస్థల టాప్ లీడర్స్ లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టింది ఇండియన్ ఆర్మీ.

ఇండియన్‌ ఆర్మీ ఎక్కడెక్కడ దాడి చేసిందంటే..

— మురిడ్కే.. ఇక్కడే లష్కరే తోయిబా హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. దాంతో, మిస్సైళ్లతో విరుచుకుపడింది భారత్‌

— బహావల్‌పూర్‌.. ఇక్కడ జైష్-ఎ-మహమ్మద్ హెడ్‌ క్వార్టర్‌ ఉంది.. ఈ ప్రాంతంపై కూడా బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ

— ముజఫరాబాద్.. పీవోకేకి హెడ్‌క్వార్టర్‌ ఇది.. ఇక్కడే హిజ్బుల్ ముజాహిదీన్‌ బెస్‌ ఉంది.. ముజఫరాబాద్‌లో రెండు ప్రాంతాలను టార్గెట్‌ చేసింది భారత్‌

— కోట్లీ.. ఇక్కడున్న టెర్రర్‌ క్యాంప్స్‌పై బాంబుల వర్షం కురిపించింది ఇండియన్‌ ఆర్మీ

— ముజఫరాబాద్‌లో మరోచోట మిస్సైళ్లతో దాడి చేసింది భారత్‌

— గుల్‌పూర్… ఇక్కడున్న టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది భారత్‌

— సియాల్‌కోట్‌.. ఇక్కడ టెర్రర్‌ క్యాంప్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించింది

— చాక్‌అమ్రూ.. ఇక్కడ టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై భారత సైన్యం దాడులు చేసింది

— ఇక పీవోకేలో 5 ప్రాంతాల్లో ఎటాక్స్‌ చేసింది

— భీంబర్‌.. ఇక్కడ కూడా టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్‌పై దాడులు చేసింది ఇండియన్‌ ఆర్మీ

ఇప్పటివరకు 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది ఇండియన్‌ ఆర్మీ. 8 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల రేంజ్‌లో మిస్సైళ్ల వర్షం కురిపించింది.

— బహావల్‌పూర్‌లో 100 కిలోమీటర్ల దూరం వరకు

— మురిడ్కేలో 30 కిలోమీటర్ల లోపలివరకు

— గుల్‌పూర్‌లో 35 కిలోమీటర్ల లోపలివరకు

— సవాయి‌లో 30 కిలోమీటర్ల లోపలివరకు

— బిలాల్‌లో 25 కిలోమీటర్ల లోపలివరకు

— కోట్లీలో 15 కిలోమీటర్ల లోపలివరకు

— బర్నాలలో 10 కిలోమీటర్ల లోపలివరకు

— సర్జల్‌లో 8 కిలోమీటర్ల లోపలివరకు

— మెహ్‌మూనాలో 15 కిలోమీటర్ల దూరం వరకు

Follow Us
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
యువతిని వేధించిన వ్యాన్ డ్రైవర్, క్లీనర్.. సీన్ కట్‌చేస్తే..
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
ఖాళీ కడుపుతో ఈ 9 పనులు అస్సలు చేయకండి.. ఆరోగ్యం జాగ్రత్త!
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..