AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Mandir Darshan: ఆన్‌లైన్‌లో రామమందిర దర్శన పాస్‌లు.. బుక్‌ చేసుకోవడం మరింత సులభం

అయోధ్యలో నిర్వహించిన చారిత్రాత్మకమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, మతపరమైన విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఈ మహత్తర సందర్భం కోసం వివిధ రకాల ఆచారాలు, కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తుంది. అయితే మనం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవాలంటే ఎలా? అని చాలా మంది నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు.

Ram Mandir Darshan: ఆన్‌లైన్‌లో రామమందిర దర్శన పాస్‌లు.. బుక్‌ చేసుకోవడం మరింత సులభం
Ayodhya Temple
Nikhil
|

Updated on: Jan 24, 2024 | 7:00 AM

Share

శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఈ మహత్తర వేడుకను తిలకించేందుకు ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యేందుకు భక్తులు ఆలయ పట్టణానికి తరలివచ్చారు.  ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు. అయోధ్యలో నిర్వహించిన చారిత్రాత్మకమైన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రధాన ఆధ్యాత్మిక, మతపరమైన విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఈ మహత్తర సందర్భం కోసం వివిధ రకాల ఆచారాలు, కార్యక్రమాలను వారం రోజుల పాటు నిర్వహిస్తుంది. అయితే మనం అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవాలంటే ఎలా? అని చాలా మంది నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. కాబట్టి శ్రీ రాముడిని దర్శించుకోవాలంటే టిక్కెట్లు ఎలా బుక్‌ చేసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. 

ఆన్‌లైన్‌ పాస్‌లకు బుక్‌ చేయడం ఇలా

  • శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్‌సైట్‌ను అన్వేషించాలి.
  • ఓటీపీ ధ్రువీకరణ కోసం మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి సైన్ఇన్ చేయాలి.
  • ఆర్తి లేదా దర్శనం కోసం స్లాట్‌ను బుక్ చేసుకోవడానికి ‘నా ప్రొఫైల్’ విభాగాన్ని యాక్సెస్ చేయాలి.
  • మీరు పాల్గొనాలనుకుంటున్న తేదీ, నిర్దిష్ట ఆర్తి సెషన్‌ను ఎంచుకోవాలి.
  • అవసరమైన అన్ని సమాచారం, ఇతర ఆధారాలను అందజేయాలి.
  • ‘ఆరతి’ వేడుకకు హాజరయ్యే ముందు ఆలయ ప్రదేశంలో నియమించిన కౌంటర్ నుంచి మీ పాస్‌ను పొందాలి.

ఆఫ్‌లైన్‌ వివరాలను ఇలా

భక్తులు స్లాట్ లభ్యతను బట్టి ఆన్-సైట్ అదే రోజు బుకింగ్‌లు చేయవచ్చు. వారు చెల్లుబాటయ్యే ప్రభుత్వ ఐడీను అందించి ఆరతికి 30 నిమిషాల ముందు ఆలయ ప్రాంగణంలో ఉండాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.