AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New born: అప్పుడే పుట్టిన ఆడబిడ్డ గొంతు కోసి.. చెత్తకుప్పలో విసిరేశారు! కానీ విధి ప్రాణం పోసింది

ఆడ పిల్లల పట్ల వివక్ష ఎప్పటికి అంతమవుతుందో.. దీనికి అంతెక్కడ ఉందో తెలియకుంది. తాజాగా అప్పుడే పుట్టిన ఆడశిశువు గొంతు కోసి చంపింది ఆ బిడ్డ సొంత అమ్మమ్మ. అనంతరం చెత్తకుప్పలో పడేసి చేతులు దులుపుకుంది. కన్నోళ్లు, అయినోళ్లు ఇంత దారుణానికి పాల్పడినా.. విధి మాత్రం విచిత్రంగా ఆ పసికందుకు అండగా నిలిచింది. మానవత్వం ఉన్న మనుషుల కారణంగా ఆ చిన్నారి తిరిగి ప్రాణం పోసుకుని మృత్యుంజయురాలిగా నిలిచింది.ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

New born: అప్పుడే పుట్టిన ఆడబిడ్డ గొంతు కోసి.. చెత్తకుప్పలో విసిరేశారు! కానీ విధి ప్రాణం పోసింది
Newborn Girl Left In Dustbin
Srilakshmi C
|

Updated on: Feb 16, 2025 | 3:14 PM

Share

భోపాల్‌, ఫిబ్రవరి 16: మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్‌ పట్టణంలో ఓ మహిళ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే బిడ్డ అమ్మమ్మ ఆ శిశువు గొంతు కోసి చంపేందుకు యత్నించింది. బిడ్డ మెడ చుట్టూ రక్తం కారడంతో అచేతనంగా మారడంతో చనిపోయి ఉంటుందని భావించి, చెత్త కుప్పలో పడేసింది. రక్తమోడుతున్న ఆ పసికందును ఆ దారిన పోయేవారు చూసి చలించి పోలీసులకు సమాచారం అందిచారు. పోలీసులు ఆ పసికందును మొదట జిల్లా ప్రభుత్వ దవాఖనకు, ఆ తర్వాత భోపాల్‌లోని కమలా నెహ్రూ దవాఖానకు తరలించారు.

ఆ ఆస్పత్రి డాక్టర్లు రెండు సర్జరీలు చేసి బిడ్డకు ప్రాణం పోశారు. కమలా నెహ్రూ హాస్పిటల్‌లోని పీడియాట్రిక్స్ విభాగం అధిపతి డాక్టర్ ధీరేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఆ పసికందును గత నెలలో గొంతువద్ద గాయాలతో మా ఆస్పత్రిలో చేర్పించారు. గొంతుకు గాయమైనప్పటికీ, ముఖ్యమైన నరాలకు దెబ్బ తగలలేదు. అందువల్లనే సర్జరీ ద్వారా తిరిగి ప్రాణం పోసుకుంది. నెల రోజులకుపైగా శ్రమించి ఆ చిన్నారికి వైద్యం చేశాం. ప్రస్తుతం ఆ శిశువు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అజేయురాలైన ఆ బిడ్డకు పీహూ అని పేరు పెట్టినట్లు తెలిపారు. పీహూ కోసం ఎవరూ రాకపోవడంతో బాలల సంక్షేమ కమిటీ అనుమతితో రాజ్‌గఢ్‌లోని ఓ షెల్టర్‌ హోమ్‌కు అప్పగించినట్లు తెలిపారు. జనవరి 11వ తేదీ రాత్రి ఈ దారుణం చోటు చేసుకోగా దాదాపు నెల తర్వాత బిడ్డ పూర్తిగా కోలుకుంది. ఈ దారుణానికి పాల్పడిన బిడ్డ తల్లి, అమ్మమ్మలను అరెస్ట్ చేసినట్లు రాజ్‌గఢ్ జిల్లాలోని పచోర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అఖిలేష్ వర్మ తెలిపారు.

పోలీసు దర్యాప్తు ప్రకారం బిడ్డ తల్లికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఈ క్రమంలో గర్భం దాల్చడంతో పుట్టిన బిడ్డను వదిలించుకోవడానికి, ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. కాగా గత నాలుగేళ్లుగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా నమోదయ్యాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 క్రైమ్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఆ సంవత్సరం రాష్ట్రంలో 175 నవజాత శిశువులను పుట్టీపుట్టగానే రోడ్లపై విసిరేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
ఇంటి నిర్మాణం.. బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..?
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..
ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..