AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: ముగిసిన అయోధ్య రామ మందిరం విరాళాల సేకరణ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ జనవరి 15 నుంచి విరాళాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ..

Ayodhya Ram Mandir: ముగిసిన అయోధ్య రామ మందిరం విరాళాల సేకరణ.. ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా..?
Subhash Goud
|

Updated on: Feb 28, 2021 | 3:46 PM

Share

Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ జనవరి 15 నుంచి విరాళాల సేకరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజల నుంచి స్వచ్చందంగా విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 27తో పూర్తయింది. అయితే ఇలా సేకరించిన మొత్తం రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సేకరించిన ఇంకా కొంత డబ్బు బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో విరాళాల మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.

అయోధ్య రామజన్మ భూమి ట్రస్ట్‌ కార్యాలయ ఇన్‌చార్జీ ప్రకాశ్‌ ఉప్తా ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ… ప్రస్తుతానికి మేము సేకరించిన విరాళాల మొత్తాన్ని అంచనా వేశామని, ఇది దాదాపు 2 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అన్నారు. మొత్తం ఎంత విరాళం సేకరించామనే లెక్కలు తేలడానికి నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చిన చాలా చెక్కులు ఇకా బ్యాంకుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, శుక్రవారం నుంచి బ్యాంకులకు వరుస సెలవులు వచ్చినందున ఆలస్యం అవుతుందని అన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న మొత్తం ఎంతనేది ఇంకా తేలాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పూర్తి మొత్తం ఎంత విరాళాలు సేకరించామనేది తేలుతుందని అన్నారు.

కాగా, అయోధ్యలో రామాలయం నిర్మాణ ఖర్చు అంచనా వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లించిన విషయం తెలిసిందే. అయోధ్య రామాలయ నిర్మాణానికి రూ.1,100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయోధ్య ప్రధాన ఆలయానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలిపింది. అయోధ్యలో రామాలయాన్ని మూడున్నరేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించారు. నిపుణుల సారథ్యంలో ఆలయ ఆకృతులు రూపకల్పన జరుగుతుందన్నారు.

అయితే రామాలయ రూపకల్పనలో ఐఐటీలు, ఇతర సంస్థల సాయం చేయనున్నాయని, ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.100 కోట్లకుపైగా విరాళాలు అందాయని వెల్లడించారు. అలాగే దాదాపు 4 లక్షల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల దగ్గరకు వెళ్తామని ప్రకటించినట్లుగానే అన్ని ప్రాంతాలకు వెళ్లి విరాళాలు సేకరించారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగింది. కేవలం స్వదేశీ నిధులతోనే రామ మందిరం నిర్మాణం జరుగుతుందని శ్రీరామ ట్రస్ట్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. భారీ ప్రచార కార్యక్రమం ద్వారా వీటిని సాధారణ పౌరుల నుంచి మాత్రమే సేకరిస్తామని, ఇందు కోసం రూ.10, రూ.100, రూ.1000 విలువగల కూపన్లను అందుబాటులో ఉంచుతూ విరాళాలు సేకరించింది రామ జన్మభూమి ట్రస్ట్‌.

భారత్‌లో పిరమిడ్స్ .. మహాభారతానికి సజీవ సాక్ష్యం.. అర్జునుడు గురువుకి దక్షిణ ఇచ్చిన ప్రాంతం ఎక్కడో తెలుసా..!