AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 48 గంటల్లో 31 మంది మృతి..

Nanded Hospital Deaths: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. 48 గంటల్లోనే ఏకంగా 31మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Maharashtra: నాందేడ్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. 48 గంటల్లో 31 మంది మృతి..
Nanded Government Hospital
Shiva Prajapati
|

Updated on: Oct 04, 2023 | 2:42 PM

Share

Nanded Hospital Deaths: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. 48 గంటల్లోనే ఏకంగా 31మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ ప్రభుత్వంపై మహారాష్ట్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాలు కొనసాగుతున్నాయి. గత 48 గంటల్లోనే 31మంది మృతి చెందారు. ఇంకా 71 మంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరణాలకు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం, మందుల కొరత కారణం కాదని.. రోగులకు సరైన వైద్యం అందించినా వారు కోలుకోలేదని చెప్పారు ఆస్పత్రి డీన్ శామ్‌రావ్‌.

ప్రభుత్వ ఆస్పత్రిలో ఏకంగా 31మంది చనిపోవడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రచారం తప్ప.. ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమంటూ మండిపడ్డారు. నాందేడ్ ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ శంకర్రావ్‌ చవాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే ఆస్పత్రి డీన్‌ శ్యామ్‌రావ్ వాకోడేను పిలిపించి అపరిశుభ్రతపై గట్టిగా నిలదీశారు.

అంతటితో ఆగకుండా డీన్‌తోనే మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఎంపీ పైపుతో గోడలపై నీళ్లు కొడుతుండగా.. డీన్‌ వైపర్‌తో మరుగుదొడ్లను శుభ్రం చేశాడు. ఆస్పత్రి డీన్‌తో ఎంపీ మరుగుదొడ్లు కడిగించడంపై వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎంపీ తీరుపై మిశ్రమంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. 48 గంటల్లోనే ఇంతమంది ప్రజల ప్రాణాలు కోల్పోవడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. మరి ఈ టనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..