AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అమ్మడూ ! నాటకాలాడకు’ ! కనికాపై హాస్పిటల్ డాక్టర్ ఫైర్

కరోనా పాజిటివ్ కనబడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పై లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఐఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్.కె.ధీమన్ మండిపడ్డారు. ఒక స్టార్ మాదిరి నాటకాలాడవద్దని, రోగిలా ఆసుపత్రి సిబ్బందికి సహకరించి ఉండాల్సిందని ఆయన ఆమెను మందలించారు.

'అమ్మడూ ! నాటకాలాడకు' ! కనికాపై హాస్పిటల్ డాక్టర్ ఫైర్
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 22, 2020 | 11:31 AM

Share

కరోనా పాజిటివ్ కనబడిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ పై లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఐఎంఎస్ హాస్పిటల్ డాక్టర్ ఆర్.కె.ధీమన్ మండిపడ్డారు. ఒక స్టార్ మాదిరి నాటకాలాడవద్దని, రోగిలా ఆసుపత్రి సిబ్బందికి సహకరించి ఉండాల్సిందని ఆయన ఆమెను మందలించారు. ‘ఐసొలేషన్ లో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలూ కల్పించాం.. మీకు కేటాయించిన ప్రత్యేక గదిలో శుభ్రమైన టాయిలెట్, పేషంట్ బెడ్, టీవీ ఉన్నాయి.. వెంటిలేషన్ కూడా ఎయిర్ కండిషన్ తో కూడుకున్నది..మీకు సప్లై చేసిన ఫుడ్ కూడా హాస్పిటల్ కిచెన్ లో స్పెషల్ గా తయారు చేసినది’ అని ఆయన పేర్కొన్నారు. కానీ కనికా కపూర్ రోగి మాదిరి కాకుండా తనో పెద్ద స్టార్ లా వ్యవహరించిందని డాక్టర్ ధీమన్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

మార్చి 11 న లండన్ నుంచి లక్నో చేరుకున్న కనికా కపూర్.కి  కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడడంతో.. నిబంధనల ప్రకారం స్వయంగా ఐసోలేషన్ కి వెళ్లాల్సిందిగా అధికారులు ఆమెకు సూచించారు. అయితే ఆ సలహాను పక్కనబెట్టిన ఆమె.. తన సొంత కార్యక్రమాల్లో నిమగ్నమైంది. తన రోగాన్ని దాచిపెట్టినందుకు ఆమెపై లక్నో  పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆమె ఇఛ్చిన డిన్నర్ కి అనేక మంది బడా పొలిటిషియన్లు, సెలబ్రిటీలు హాజరైన సంగతి తెలిసిందే.. వీరిలో బీజేపీ నేత,  రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే సింధియా, ఆమె కుమారుడు దుశ్యంత్ సింగ్ కూడా ఉన్నారు. అయితే వీరికి కరోనా టెస్టులు నిర్వహించిన అనంతరం.. నెగటివ్ అని రిపోర్టులు వచ్చాయి.