AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monsoon: హమ్మయ్య.. ! చల్లటి వార్త వచ్చేసింది.. రుతుపవనాల రాక ఎప్పుడంటే..?

వేసవి ముగిసిన వెంటనే పలకరించాల్సిన తొలకరి ఇంకా దోబూచులాడుతోంది. అకాల వర్షాలతో ఇన్నాళ్లూ తడిసిముద్దయినా స్వచ్ఛమైన రుతుపవన వాన కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు జనం. కానీ.. మన్సూన్‌కి ఎక్కడో బ్రేకులు పడుతున్నాయి. ఎక్కడ...? నైరుతి రుతుపనాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులేమిటి? రుతుపవనాల ఆగమనం ఎప్పుడు..?

Monsoon: హమ్మయ్య.. ! చల్లటి వార్త వచ్చేసింది.. రుతుపవనాల రాక ఎప్పుడంటే..?
Southwest Monsoon
Ram Naramaneni
|

Updated on: Jun 07, 2023 | 4:37 PM

Share

ఏటా మే నెల ఆఖర్లో గానీ, జూన్ ఫస్ట్‌వీక్‌లో గానీ నైరుతి రుతుపవనం కేరళను తాకాలి. గత ఏడాది మే 29, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది మాత్రం ఆ సుముహూర్తం వాయిదా పడుతూనే ఉంది. మొదట్లో జూన్ నాలుగోతేదీ అని, ఆ తర్వాత ఏడున… అంటే బుధవారం మన్సూన్ వచ్చుడు పక్కా అని అనౌన్స్‌మెంట్ ఇచ్చింది IMD. కానీ.. ఏదో అంతుబట్టని శక్తి సైంధవుడిలా అడ్డుపడుతోంది.

అరేబియా మహాసముద్రంలో తిష్ట వేసిన బిపర్ణాయ్ తుఫాన్ కదలికలే రుతుపవనాల గమనాన్ని శాసిస్తున్నాయట. మరో 9రోజుల పాటు అరేబియా సముద్రంలో ఉత్తరం దిశగా ఈ తుఫాను కొనసాగే చాన్సుంది. తీవ్ర తుఫాన్‌గా మారుంతుందంటున్న హెచ్చరికలూ ఉన్నాయి. దీని ఫలితంగానే పదిరోజులుగా అండమాన్, లక్షద్వీప్‌లోనే నిలిచిపోయాయి రుతుపవనాలు. తుపాను కారణంగా రుతుపవనాలు మరింత ఆలస్యం కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేశారు. కానీ, ఆ అంచనా తప్పింది. రానున్న 48 గంటల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) బుధవారం తెలిపింది. చల్లని గాలులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, కేరళ తీరాల ప్రాంతాలలో మేఘాల పెరుగుదల కనిపిస్తోందని  వెల్లడించింది.

కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది నైరుతి రుతుపవనం. దీని రాకతోనే దేశమంతా చల్లబడేది. విత్తు పెట్టేందుకు..  రుతుపవనాల రాక కోసం  ఎదురు చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.