మండే ఎండల్లో చల్ల.. చల్లగా.! అనుకున్న సమయానికంటే ముందే.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు..

రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది వాతావావరణ శాఖ. దాదాపు 50డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ ఏడాది సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని గుడ్ న్యూస్ చెప్పింది IMD.

మండే ఎండల్లో చల్ల.. చల్లగా.! అనుకున్న సమయానికంటే ముందే.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు..
Rains
Follow us

|

Updated on: Apr 16, 2024 | 8:11 AM

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చి నుంచే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక, మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ అంచానాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఐక్యరాజ్యసమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలనిసూచిస్తుంది. ఈఎండలు పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ కారణంగా దాదాపు 25 కోట్ల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2023లో సగటు వర్షపాతం 868 మి.మీ కంటే తక్కువగా 820 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇదేక్రమంలో IMD రుతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాల సగటు 87 సెం.మీ కంటే 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

జూన్‌ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని అధికారులు వెల్లడించారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్‌ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జూలై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. హిందూ మహాసముద్రం డైపోల్, లానినా పరిస్థితులు ఒకే టైంలోవేగంగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్న రుతు పవనాలు పసిఫిక్‌లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు.

దీని కారణంగా దేశంలో జులై నుంచి సెప్టెంబరు వరకు గరిష్ట రుతుపవన పరిస్థితులను పెంచుతుందన్నారు వాతావరణశాఖ అధికారులు. పశ్చిమ, వాయువ్య భారత్, ఉత్తర అరేబియా సముద్రంలో రుతుపవనాల అల్పపీడనాలు లేదా అల్పపీడనాలు విస్తరించి, స్థిరంగా వర్షాలను కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షపాతం పెరుగుతుందని సూచిస్తుంది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం అందిస్తుంది, ఇది వ్యవసాయ రంగానికి కీలకం. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా 14 శాతంగా ఉంది.

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?