AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతువుల స్మగ్లింగ్‌తో అక్రమ సంపాదన.. అక్బర్‌ బంజారా ముఠాకు చెందిన రూ.300కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు..

అక్బర్ బంజారా తన తమ్ముడు సల్మాన్‌ను కూడా ఈ బ్లాక్ వ్యాపారంలో చేర్చుకున్నాడు. అక్బర్ బంజారా అతి తక్కువ సమయంలో బిలియనీర్ అయ్యాడు. దీని తరువాత, అస్సాంలోని రెడ్డి గ్యాంగ్‌తో చేతులు కలిపి, అంతర్జాతీయ

జంతువుల స్మగ్లింగ్‌తో అక్రమ సంపాదన.. అక్బర్‌ బంజారా ముఠాకు చెందిన రూ.300కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు..
International Cow Smuggler
Jyothi Gadda
|

Updated on: Jan 04, 2023 | 11:24 AM

Share

ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న నేరాలకు అడ్డుకట్టపడేలా కనిపించటం లేదు. అధికారులు, పోలీస్‌ యంత్రాంగం ఎన్ని కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ కొందరు దుర్మార్గులు యద్ధేచ్చగా అక్రమకార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా, యూపీలోని మీరట్ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. మంగళవారం ఫలవాడ గ్రామంలో అంతర్జాతీయ ఆవుల స్మగ్లర్ అక్బర్ బంజారా ముఠాపై పోలీసులు కొరఢా ఝుళిపించారు. అక్బర్ బంజారా ముఠాకు చెందిన రెండు కోట్ల ఆస్తులను మీరట్ పోలీసులు జప్తు చేశారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులపై పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తోంది.

అక్బర్ బంజారా ఎవరు ..? అక్బర్‌ బంజారా ఉత్తరప్రదేశ్‌లోని ఫలవాడ గ్రామంలో జంతువుల అక్రమ అమ్మకాల ద్వారా కోటీశ్వరుడు అయ్యాడు. ఏడేళ్ల నుంచి జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం ఆవుల స్మగ్లింగ్‌లో చిక్కుకున్న అక్బర్ బంజారా.. మీరట్, బిజ్నోర్ తదితర రాష్ట్రాల్లో సుమారు 300 కోట్ల ఆస్తులు సంపాదించాడు. అక్బర్ బంజారా తన తమ్ముడు సల్మాన్‌ను కూడా ఈ బ్లాక్ వ్యాపారంలో చేర్చుకున్నాడు. అక్బర్ బంజారా అతి తక్కువ సమయంలో బిలియనీర్ అయ్యాడు. దీని తరువాత, అస్సాంలోని రెడ్డి గ్యాంగ్‌తో చేతులు కలిపి, అంతర్జాతీయ పశువుల స్మగ్లర్లలో బంజారా పేరు కనిపించడం ప్రారంభమైంది. దీని తరువాత అక్బర్ బంజారా బ్లాక్ వ్యాపారం మరింత విస్తరించింది.

బుల్‌డోజర్‌తో అక్రమ ఆస్తులు కూల్చివేత ఇప్పటి వరకు 37 కోట్ల విలువైన బంజారా ముఠా అక్రమ ఆస్తులను పోలీసులు అటాచ్ చేశారు. అదే సమయంలో, నల్ల వ్యాపారంతో చేసిన అక్రమ ఆస్తులను కూడా బుల్డోజర్ల ద్వారా నేలమట్టం చేశారు. ఫలవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇల్లు, 21 బిగాల భూమిని పోలీసులు సీల్ చేశారు. ఈ ఆస్తిని అక్బర్ బంజారా సోదరుడు సమీమ్ బంజారా పేరిట రిజిస్టర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆవుల స్మగ్లింగ్ వ్యాపారంతో సంపాధించిన ఆస్తులు.. మీరట్ పోలీసుల సమాచారం ప్రకారం, బంజారా ముఠాలోని కార్యకర్తలందరూ ఆవుల స్మగ్లింగ్ బ్లాక్ వ్యాపారం నుండి అక్రమంగా కోట్ల ఆస్తి సంపాదించారు. ఇది ఈరోజు అటాచ్ చేయబడింది. ఇంతకు ముందు కూడా బంజారా ముఠాపై పోలీసులు చాలాసార్లు చర్యలు తీసుకున్నారు. నేర ప్రపంచం నుంచి సృష్టించిన సంపదపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు ఇతర ఆస్తులపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.