బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!

భారతదేశంపై దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవైన ఒక భారీ మేఘాల సమూహం (Monster Cloud) ఆవరించి ఉందని వాతావరణ నిపుణులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. ఈ భారీ మేఘాల సమూహం (Western Disturbance) ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతం నుంచి దూసుకొస్తున్న భయంకర మేఘాల దండు.. పలు రాష్ట్రాల్లో భారీ విపత్తు హెచ్చరికలు!
Monster Cloud
Image Credit source: News 9

Updated on: May 16, 2026 | 12:42 PM

భారతదేశ వాతావరణంలో ఊహించని భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. దేశంలోని వాతావరణాన్ని గడగడలాడించే ఒక అసాధారణ, భయంకరమైన పరిణామం బంగాళాఖాతంలో చోటు చేసుకోతోతోంది. ఢిల్లీ నుండి చెన్నైకి ఎంత దూరం ఉంటుందో.. అంతటి భారీ పరిమాణంలో, అంటే దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవున్న ఒకే ఒక మేఘాల సమూహం దూసుకొస్తోంది. వాతావరణ శాస్త్రంలో దీనిని స్క్వాల్ లైన్ లేదా మెసోస్కేల్ కన్వెక్టివ్ సిస్టమ్ (MCS) అని పిలుస్తారు. ఇది మన దేశం మొత్తం పరిమాణంలో ఉండటం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.

శాటిలైట్ చిత్రాల ఆధారంగా దాదాపు 3,000 కిలోమీటర్ల పొడవైన ఒక అతిపెద్ద మేఘాల సమూహం (Monster Cloud) భారతదేశం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్, పాకిస్తాన్ మీదుగా ప్రయాణిస్తూ భారత్‌పై విస్తరిస్తున్న ఈ భారీ పశ్చిమ అల్లకల్లోలం (Western Disturbance) కారణంగా రాబోయే కొన్ని రోజుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.

ఇది ఎలా ఏర్పడింది? దీని శక్తి ఎంత?:

సాధారణంగా ఒక ఉరుముల మేఘం 10-20 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ, ప్రస్తుతం బంగాళాఖాతంలోని నీరు 31 డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కడం, దానికి అరేబియా సముద్రం నుండి వీస్తున్న బలమైన పశ్చిమ గాలులు తోడవడంతో వందలాది మేఘాలు కలిసిపోయి ఈ వినాశకర వ్యవస్థగా మారాయి. దీని కేంద్రంలో 15-18 కిలోమీటర్ల ఎత్తైన వేడి గోపురం ఉంది. ఇది ప్రతి సెకనుకు 10 టన్నుల నీటిని పైకి పీల్చుకుంటూ ఒక మేఘాల కర్మాగారంలా పనిచేస్తోంది. ఇది ఒక్క రాత్రిలోనే లేదా కేవలం 6 గంటల్లోనే 200-300 మిల్లీమీటర్ల వర్షాన్ని కురిపించగలదు. ఇది కోల్‌కతా నగరంలో ఒక నెల మొత్తం కురిసే వర్షపాతంతో సమానం.

ఇవి కూడా చదవండి

ఈ భారీ మేఘాల వల్ల పొంచి ఉన్న 5 భయంకరమైన విపత్తులు:

మేఘ విస్ఫోటనాలు (Cloudbursts): కొండ ప్రాంతాలైన సిక్కిం, ఉత్తర బెంగాల్, మేఘాలయ రాష్ట్రాలలో కేవలం ఒక గంటలో 100 మిమీ వర్షం కురిసి, 2013 కేదార్‌నాథ్ తరహా విపత్తును సృష్టించగలదు.

మెరుపు సునామీ: ఈ వ్యవస్థ గంటకు 20,000 నుండి 30,000 మెరుపులను సృష్టించగలదు. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నగరాలను ముంచెత్తే ఆకస్మిక వరదలు: కోల్‌కతా, హౌరా, ఢాకా, చిట్టగాంగ్ వంటి నగరాల డ్రైనేజీ వ్యవస్థలు కేవలం 50 మిమీ వర్షాన్ని మాత్రమే తట్టుకోగలవు. 200 మిమీ వర్షం పడితే రోడ్లన్నీ నదులుగా మారి, మెట్రో, విమానాశ్రయాలు స్తంభించిపోతాయి.

సూపర్ నార్ వెస్టర్స్ (భారీ గాలులు): ఈ మేఘాల ముందు భాగంలో గంటకు 120-150 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు అంఫాన్ తుఫాను తరహాలో రేకుల కప్పులు, చెట్లు, కరెంట్ స్తంభాలను నేలకూల్చగలవు.

తీవ్ర పంట నష్టం: వరి, జనపనార, కూరగాయల పంటలు పూర్తిగా కుళ్ళిపోతాయి. తీర ప్రాంతాల్లోకి ఉప్పునీరు చేరడం వల్ల భూములు రాబోయే మూడేళ్లపాటు వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ అసాధారణ వాతావరణ మార్పుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అలర్ట్ అయ్యాయి. కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, మైదాన ప్రాంతాల్లోని ప్రజలు పిడుగుపాటు ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి వర్షం పడే సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us