AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది చేసిన పని తెలిస్తే..

భారతీయ రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, నిజాయితీని చాటే ఒక అద్భుతమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళా ప్రయాణికురాలు రైలు టాయిలెట్ వాడుతుండగా ఆమె విలువైన బంగారు ఉంగరం ప్రమాదవశాత్తు బేసిన్ గుండా కింద ఉన్న డ్రైనేజీ పైపులోకి పడిపోయింది. ఆందోళన చెందిన ఆమె వెంటనే రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న రైల్వే మెయింటెనెన్స్ సిబ్బంది, తదుపరి స్టేషన్‌లో రైలు ఆగగానే ఏమాత్రం

రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం.. రైల్వే సిబ్బంది చేసిన పని తెలిస్తే..
Gold Ring Recovery
Jyothi Gadda
|

Updated on: May 16, 2026 | 10:22 AM

Share

భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత కోసమే కాకుండా, వారి సమస్యలను పరిష్కరించడంలోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని మరోసారి నిరూపించింది. రైలు ప్రయాణంలో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం చాలా కష్టమని అందరూ భావిస్తుంటారు. కానీ, ఇక్కడ జరిగిన ఒక అరుదైన ఘటనలో రైల్వే సిబ్బంది చూపిన నిజాయితీ, కార్తవ్య దీక్ష ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రైలు టాయిలెట్‌లోని మురికి పైపులోకి జారిపోయిన ఒక మహిళ బంగారు ఉంగరాన్ని సిబ్బంది ఎంతో శ్రమించి వెలికితీసి వారికి తిరిగి అప్పగించారు. అసలేం జరిగిందంటే..

ఒక మహిళా ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో టాయిలెట్‌కు వెళ్లారు. అక్కడ అనుకోకుండా ఆమె చేతికున్న విలువైన బంగారు ఉంగరం ఊడి, నేరుగా టాయిలెట్ డ్రైనేజీ హోల్ గుండా కింద ఉన్న మురుగు పైపుల్లోకి వెళ్ళిపోయింది. ఎంతో సెంటిమెంట్, విలువైన ఆ ఉంగరం చేజారిపోవడంతో ఆమె ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అధైర్యపడకుండా, ఆమె వెంటనే రైల్వే అధికారులకు తెలియజేసింది. హెల్ప్‌లైన్ నంబర్ 139 ద్వారా ఈ విషయంపై రైల్వేకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

కంట్రోల్ రూమ్ నుండి సమాచారం అందుకున్న మెకానికల్, క్లీనింగ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. రైలు తదుపరి స్టేషన్‌లో ఆగడమే ఆలస్యం.. వారు వెంటనే రంగంలోకి దిగారు. టాయిలెట్ కింద ఉండే మురు, వ్యర్థాల పైపులను విప్పడం సాధారణంగా ఎంతో అసహ్యకరమైన, కష్టతరమైన పని. అయినప్పటికీ, రైల్వే సిబ్బంది ఏమాత్రం వెనుకాడకుండా టాయిలెట్ కింద ఉండే కెమికల్ ట్యాంక్, డ్రైనేజీ అవుట్‌లెట్ పైపులను విప్పి, ఆ మురికిలోనే ఉంగరం కోసం వెతకడం ప్రారంభించారు.

చివరకు వారి శ్రమ ఫలించింది. ఎంతో శ్రమించి ఆ మురుగు వ్యర్థాల నుండి బంగారు ఉంగరాన్ని సురక్షితంగా బయటకు తీశారు. దానిని శుభ్రం చేసి సదరు మహిళా ప్రయాణికురాలికి అప్పగించారు. తన ఉంగరం మళ్లీ దొరుకుతుందని ఊహించని ఆ మహిళ, రైల్వే సిబ్బందికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వివరాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నిమిషాల్లో వైరల్‌గా మారాయి. భారతీయ రైల్వే సిబ్బంది పనితీరు అమోఘం, మురికిని కూడా లెక్కచేయకుండా ప్రయాణికురాలి ఆవేదనను అర్థం చేసుకున్న సిబ్బందికి సెల్యూట్ అంటూ నెటిజన్లు సదరు రైల్వే ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రైల్వే శాఖ కూడా తమ సిబ్బంది సమయస్ఫూర్తిని, సేవా భావాన్ని అభినందించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
రైలు టాయిలెట్‌లో పడిపోయిన బంగారు ఉంగరం..రైల్వే సిబ్బంది చేసిన పని
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
ఒకే ఫ్యామిలీలో 5 మందికి నీట్ ర్యాంక్! సీబీఐ విచారణలో సంచలన నిజాలు
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా వెంటాడిన మృత్యువు.. పెళ్లైన..
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
సింగర్‌పై నోట్ల వర్షం.. ఏకంగా డబ్బుల సంచులే కుమ్మరించిన భక్తులు!
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
LPG గ్యాస్ ఏజెన్సీ పెట్టాలంటే ఎంత పెట్టుబడి కావాలి?
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
182 దేశాలు..100 కోట్ల మంది ప్రజలు.. అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
సొరకాయ vs బీరకాయ: సమ్మర్‌లో బాడీని కూల్‌ చేయడానికి ఏది బెస్ట్‌!
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
రేపే JEE Advanced 2026: ఫలితాలు, ర్యాంకులు, JoSAA కౌన్సిలింగ్‌పై
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
అమ్మమ్మల కాలం నాటి పల్లెటూరి సమ్మర్ ఎనర్జీ డ్రింక్
నేను పలకరించలేదని ఆ హీరో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు..
నేను పలకరించలేదని ఆ హీరో చేసిన పనికి మైండ్ పనిచేయలేదు..