AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న తల్లి నుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు.. సీసీ కెమెరాలో లైవ్‌ రికార్డ్‌..

పోలీసు బృందాలు ఇప్పుడు నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నిందితుడి ఫోటో ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి..

Viral News: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న తల్లి నుంచి చిన్నారిని కిడ్నాప్‌ చేసిన దుండగుడు.. సీసీ కెమెరాలో లైవ్‌ రికార్డ్‌..
Up Railway Station
Jyothi Gadda
|

Updated on: Aug 28, 2022 | 3:31 PM

Share

Viral Video: రైల్వే స్టేషన్‌లో నిద్రిస్తున్న ఏడు నెలల శిశువును తల్లి నుండి కిడ్నాప్ చేస్తున్న ఓ వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. మధుర రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ కిడ్నాప్‌ ఉదాంతం.. నేరానికి సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై నిద్రిస్తున్న వారిపై నడుచుకుంటు వెళ్లడం చూడవచ్చు. అక్కడంతా గాఢ నిద్రలో ఉన్నారు. ఆ వ్యక్తి తన చేతుల్లో బిడ్డతో ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న రైలు వైపు పరుగెత్తాడు.

ఇవి కూడా చదవండి

పోలీసు బృందాలు ఇప్పుడు నిందితుడి కోసం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. నిందితుడి ఫోటో ఆన్‌లైన్‌లో షేర్‌ చేశారు. నిందితులను పట్టుకోవడానికి హత్రాస్, అలీఘర్‌లలో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. అనుమానితుడి గురించిన వివరాలను సేకరించేందుకు మధుర రైల్వే స్టేషన్‌లోని అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి