AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరి మృతి , ఏడుగురికి గాయాలు

ముంబై లోని మదనపుర ప్రాంతంలో పురాతన భవనం కుప్పకూలింది. ఫనూస్‌వాలా బిల్డింగ్‌ కుప్పకూలడంతో ఒకరు చనిపోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవాళ్లను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముంబైలో కుప్పకూలిన భవనం.. ఒకరి మృతి , ఏడుగురికి గాయాలు
Mumbai Old Residential Building Collapsed
Balaraju Goud
|

Updated on: Oct 22, 2025 | 8:58 PM

Share

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఒక పాత నివాస భవనం అకస్మాత్తుగా కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సెంట్రల్ ముంబైలోని మదన్‌పురా ప్రాంతంలోని ఒక అంతస్థుల ఫనూస్వాలా భవనంలో ఈ సంఘటన జరిగిందని మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 12:48 గంటల ప్రాంతంలో నివాస భవనంలోని ఒక భాగం కూలిపోవడంతో ఏడుగురు గాయపడ్డారు. వారందరినీ చికిత్స కోసం రెండు వేర్వేరు ఆసుపత్రులలో చేర్చారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, నాలుగు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించడం ప్రారంభించాయి. ఫనూస్‌వాలా బిల్డింగ్‌లో మొదటి అంతస్తు కుప్పకూలినట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..