మధ్యప్రదేశ్… సంక్షోభంలో కమల్ నాథ్ ప్రభుత్వం.. గుర్ గావ్ హోటల్లో అర్ధరాత్రి హైడ్రామా

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆద్వర్యంలోని 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర రాజకీయ సంచలనాలు అర్దరాత్రి,  బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగాయి.

మధ్యప్రదేశ్... సంక్షోభంలో కమల్ నాథ్ ప్రభుత్వం.. గుర్ గావ్ హోటల్లో అర్ధరాత్రి హైడ్రామా
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 04, 2020 | 11:35 AM

మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ ఆద్వర్యంలోని 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన ఈ రాష్ట్ర రాజకీయ సంచలనాలు అర్దరాత్రి,  బుధవారం ఉదయం వరకు కూడా కొనసాగాయి. అసలే అరకొర మెజారిటీతో కొనసాగుతున్న కమల్ నాథ్ ప్రభుత్వం బీజేపీ ఎత్తుగడలతో చిక్కుల్లో పడింది. తమ పార్టీకి చెందిన సుమారు ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు గుర్ గావ్ లోని ఫైవ్ స్టార్ హోటల్ ..’మానెసార్’ కి బలవంతంగా తరలించి నిర్బంధించారని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. కాగా..ఈ ఎనిమిది మంది శాసన సభ్యుల్లో నలుగురు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒకరు బీఎస్పీ నుంచి సస్పెండయిన రమాబాయి అనే ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయితే రమాబాయిని, కాంగ్రెస్ కు చెందిన బిసాహులాల్ సింగ్ అనే ఎమ్మెల్యేని ఇద్దరు రాష్ట్ర మంత్రులు జైవర్ధన్ సింగ్, జీతూ పట్వారి ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హోటల్ నుంచి బయటికి తీసుకువఛ్చి..’రక్షించారు’. (దిగ్విజయ్ సింగ్ కుమారుడే జైవర్ధన్ సింగ్). ఈ దేశ రాజకీయాలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోందని, డబ్బు, కండ బలంతో కమల్ నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు యత్నిస్తోందని జైవర్ధన్ సింగ్ ఆరోపించారు. అయితే ఈ సర్కార్ ఐదేళ్లూ కొనసాగుతుందని ఆయన ట్వీట్ చేశారు. అటు-ఒక్కో ఎమ్మెల్యేకి 25 నుంచి 35 కోట్లు ఇఛ్చి తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ నేతలు బేరసారాలాడుతున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, మరో బీజేపీ నేత నరోత్తమ్ మిశ్రా, మరికొందరు కమలం పార్టీ నాయకులు వీరిని ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. 230 మంది సభ్యులున్న రాష్ట్ర అసెంబ్లీలో 113 మంది కాంగ్రెస్ పార్టీకి, 107 మంది బీజేపీకి చెందినవారు ఉన్నారు. ఇద్దరు బహుజన్ సమాజ్ పార్టీకి చెందినవారు కాగా.. ఒకరు సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు. నలుగురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సభలో మెజారిటీ మార్క్ 116. అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించినా  కమల్ నాథ్ ప్రభుత్వం గండంలో పడుతుంది.

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు