AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను చంపి 2 రోజులపాటు ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త.. అనారోగ్యంతో మృతి చెందిందని డ్రామాలు!

కట్టుకున్న భార్యను చంపి ఫ్రిడ్జ్‌లో రెండు రోజులపాటు దాచాడో భర్త. పైగా ఆమె అనారోగ్యంతో చనిపోయిందంటూ డ్రామాలాడాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఆదివారం (జులై 2) వెలుగుచూసింది...

భార్యను చంపి 2 రోజులపాటు ఫ్రిడ్జ్‌లో దాచిన భర్త.. అనారోగ్యంతో మృతి చెందిందని డ్రామాలు!
Murder Case
Srilakshmi C
|

Updated on: Jul 03, 2023 | 3:20 PM

Share

భోపాల్‌: కట్టుకున్న భార్యను చంపి ఫ్రిడ్జ్‌లో రెండు రోజులపాటు దాచాడో భర్త. పైగా ఆమె అనారోగ్యంతో చనిపోయిందంటూ డ్రామాలాడాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఆదివారం (జులై 2) వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా జివులా గ్రామానికి చెందిన సుమిత్ర మిశ్రా (40), భరత్‌ మిశ్రా దంపతులు. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. సుమిత్ర గత నెల 30వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందింది. ఐతే ఆమె మరణ వార్తను భర్త భరత్‌ మిశ్రా ఎవరికీ తెలపకుండా గుట్టుగా ఉంచాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని తమ ఇంట్లోని ఫ్రిజ్‌లో మూడు రోజులపాటు భద్రపరిచాడు. సుమిత్ర మృతి చెందిన విషయం జులై 2న తెలుసుకున్న ఆమె సోదరుడు అభిరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు భరత్ మిశ్రా ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా సుమిత్ర మృతదేహం ఫ్రిజ్‌లో కనిపించింది.

సుమిత్ర కామెర్ల కారణంగా గత శుక్రవారం (జూన్ 30) మృతి చెందిందని.. అంత్యక్రియలకు ముంబై నుంచి తన కొడుకు వస్తాడని.. అందుకే ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచి ఉంచినట్లు పోలీసులకు తెలిపాడు. సుమిత్ర మృతిపై సోదరుడు అభిరాజ్ అనుమానాలు వ్యక్తం చేశారు. సుమిత్రను ఆమె భర్త భరత్ కొట్టి చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐతే ఆమె మృతికి గల అసలైన కారణం తెలుసుకునేందకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ విజయ్ సింగ్ మీడియాకు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు