AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MP Election: డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు వద్దు.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన భోపాల్‌ అభ్యర్థులు

మధ్యప్రదేశ్‌లో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి, ఎన్నికల కమిషన్ EVM తప్పులు, అధికారులు తీరుపై, మద్యం, డబ్బు, ఇతరత్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అయితే తాజా ఎన్నికల కమిషన్‌కు వచ్చిన దరఖాస్తు హాట్ టాపిక్‌గా మారింది. భోపాల్‌లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3కి బదులుగా వేరే రోజు నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

MP Election: డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు వద్దు.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన భోపాల్‌ అభ్యర్థులు
Mp Vote Counting
Balaraju Goud
|

Updated on: Nov 26, 2023 | 8:35 PM

Share

మధ్యప్రదేశ్‌లో ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినప్పటి నుండి, ఎన్నికల కమిషన్ EVM తప్పులు, అధికారులు తీరుపై, మద్యం, డబ్బు, ఇతరత్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అయితే తాజా ఎన్నికల కమిషన్‌కు వచ్చిన దరఖాస్తు హాట్ టాపిక్‌గా మారింది. భోపాల్‌లో ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3కి బదులుగా వేరే రోజు నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. డిసెంబరు 3న ఫలితాలు వస్తాయని, అయితే ఆ రోజు మాత్రం సంబరాలు జరుపుకునేందుకు అవకాశం ఇవ్వద్దని ఈసీని కోరారు. ఇది వేలాది మంది మరణించిన వారి ఆత్మకు బాధ కలుగుతుందని దరఖాస్తులో పేర్కొన్నారు.

డిసెంబర్ 3 భోపాల్ గ్యాస్ ట్రాజెడీ జరిగిన రోజు. ఈ విషాదం 1984 డిసెంబర్ 3న జరిగింది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఆ తర్వాత భోపాల్‌లో సంబర వాతావరణం లేకుండా అడ్డుకోవాలని సూచించారు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై ఇక్కడి అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

భోపాల్ నార్త్ నుండి స్వతంత్ర అభ్యర్థి అతావుల్లా ఇక్బాల్, ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రకాష్ నార్వేర్, ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థి నరేలా షామా తన్వీర్, ఆజాద్ సమాజ్ పార్టీ భోపాల్ సెంట్రల్ నుండి అభ్యర్థి షంసుల్ హసన్‌కు మద్దతుగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబరు 3న జరగనున్న ఓట్ల లెక్కింపును మరేదో రోజు నిర్వహించాలని ఈ దరఖాస్తులో పేర్కొన్నారు.

భోపాల్‌లో డిసెంబర్ 3, 1984న గ్యాస్ విషాదం జరిగిందని భోపాల్ జిల్లాకు చెందిన నలుగురు అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌కు తమ దరఖాస్తులో తెలిపారు. ఈ దుర్ఘటనలో వేలాది మంది చనిపోయారు. ఇప్పుడు ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న మాత్రమే, గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటారు, బ్యాండ్ మేళాలు వాయిస్తారు. ఇది మరణించిన వారి ఆత్మకు బాధ కలిగిస్తుంది. అందుకే భోపాల్‌లో ఓట్ల లెక్కింపును వేరే రోజు నిర్వహించాలని కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
సమస్య పరిష్కారానికి వినూత్న నిరసన.. ఏం చేశారో చూడండి
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
మతిపోగోడుతున్న మహేష్ మేనకోడలు.. జాన్వీ లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
వేసిన కాసేపటికే ఆరిపోతున్న వీధి లైట్‌లు.. ఎన్ని సార్లు వేసినా..
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
శుక్రుడి గ్రహ మార్పు.. ఇక లగ్జరీ జీవితం మీ సొంతం!
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
రామ్ చరణ్ నాకు పెద్దన్నయ్య అయితే మంచి ఫ్రెండ్ మాత్రం ఆ హీరోనే
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
ఇంట్లో టికెట్ మర్చిపోయినా ట్రైన్లో ప్రయాణించవచ్చు.. ఎలా అంటే..?
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే దాహం దాహం
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ఉన్నవాళ్లు కూడా హ్యాపీగా తినే పకోడీ
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే
సిగరెట్ అలవాటు మానేయడం కష్టమా? చాలా మంది ఎందుకు ఫెయిల్‌ అవుతారంటే