AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ప్రేమ వివాహం చేసుకున్నారని.. ఓ జంటను గ్రామస్థులు ఎలా శిక్షించారు చూడండి!

ఒడిశాలోని రాయగడ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను గ్రామస్థులు దారుణంగా హింసించారు. గ్రామ ఆచారాలకు విరుద్ధంగా వారి వివాహం జరిగిందని, పొలం దున్నించి, గుడిలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రేమ వివాహాలపై సమాజంలోని వివిధ దృక్పథాలను ప్రశ్నించేలా ఉంది.

SN Pasha
|

Updated on: Jul 12, 2025 | 7:00 AM

Share

ప్రేమ పెళ్లిళ్లు సర్వసాధారణం అయిపోయినా.. ఎక్కువ శాతం పెద్దలు కూడా పిల్లల ఇష్టానికి గౌరవం ఇస్తున్న ఈ కాలంలో కూడా కొంతమంది ప్రేమ వివాహాలను పెద్ద తప్పులాగా చూస్తున్నారు. ఏదో చేయకూడని ఘోరాలు చేసినట్లుగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో గ్రామస్థులు ప్రవర్తించిన తీరు అందుకు ఎగ్జాంపుల్‌. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఓ యువ జంటను వారిని నాగలికి ఎద్దుల్లాగా కట్టి.. కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితక బాదారు. ఆపై పాపపరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేశారు.

ఒడిశా – రాయగడ జిల్లాలోని కంజమజ్జిరా గ్రామంలో ఓ యువకుడు, యువతి చాలాకాలంగా ప్రేమించుకొని.. పెద్దలను ఒప్పించి ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాపపరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us