AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kishan Reddy: చంద్రబాబు, నితీష్‌ను ఇండియా కూటమి రెచ్చగొడుతోంది.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకూ కొత్త సారథి నియామకం జరగబోతుందన్నారు.

Shaik Madar Saheb
|

Updated on: Jun 10, 2024 | 9:51 AM

Share

బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాఖకూ కొత్త సారథి నియామకం జరగబోతుందన్నారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారం పూర్తయిన నేపథ్యంలో పార్టీ సంస్థాగత మార్పులపై త్వరలోనే కసరత్తు చేసి కొత్తవారిని నియమిస్తారని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ఇండియా కూటమిది దివాళాకోరు రాజకీయమని విమర్శించారు కిషన్‌రెడ్డి. ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రతిపక్షం రాకపోవడం ఇదే మొదటిసారి అన్నారు. చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్ ను ఇండియా కూటమి రెచ్చగొడుతుందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

ఎన్నికలకు ముందే చంద్రబాబు, నితీష్‌తో పొత్తు పెట్టుకున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాణానికి ముందు కొత్త కేబినెట్‌కు మోదీ దిశానిర్దేశం చేశారని.. మంత్రులు నడుచుకోవాల్సిన విధానంపై హితబోధ చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.

కిషన్ రెడ్డి వీడియో..

కాగా.. కిషన్ రెడ్డి నిన్న రాత్రి కేంద్రమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిపారు.. మోదీ 3.0లో సర్కార్ లో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..