AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌ రెడ్డి! బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దివంగత అరుణ్ జైట్లీ గురించి రాహుల్ గాంధీ చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. రాహుల్ గాంధీ స్వార్థ రాజకీయాల కోసం మృతులను ఉపయోగించుకోవడం దారుణమని, అరుణ్ జైట్లీ కుటుంబానికి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన కిషన్‌ రెడ్డి! బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ..
Kishan Reddy And Rahul Gand
SN Pasha
|

Updated on: Aug 02, 2025 | 7:34 PM

Share

సోషల్ మీడియా వేదికగా దివంగత అరుణ్ జైట్లీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ తన స్వార్థ రాజకీయాల కోసం మృతుడిని లాగడం దయనీయమే కాదు, నీచమైనది. అరుణ్ జైట్లీ ఆగస్టు 2019లో మరణించారు. వ్యవసాయ చట్టాలు 2020లో ప్రవేశపెట్టాం.. రాజకీయాల కోసం మన మధ్యలో లేని వారిని దురుద్దేశంతో కించపరచడం సరికాదు. రాహుల్ గాంధీ ఇలాంటి నీచమైన రాజకీయాలను ఆశ్రయించడం ఇదే మొదటిసారి కాదు. మనోహర్ పారికర్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆయన తన సందర్శనను రాఫెల్ రక్షణ ఒప్పందంపై రాజకీయం చేశారు. రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ కుటుంబానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి