Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్.. పాక్ కు భారత పరాక్రమం రుచి చూపిన రోజు.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం

దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని సూచిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ పరాక్రమాన్నిరుచి చూపించింది.'ఆపరేషన్ విజయ్' తో కార్గిల్ నుండి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధ భేరీ మ్రోగించింది.

Kargil Vijay Diwas: నేడు కార్గిల్ విజయ్ దివస్.. పాక్ కు భారత పరాక్రమం రుచి చూపిన రోజు.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం
Kargil Vijay Diwas
Follow us

|

Updated on: Jul 26, 2022 | 9:06 AM

Kargil Vijay Diwas 2022: నేడు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటున్నారు. కార్గిల్ కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌కు ఉమ్మడి రాజధాని. 1999 మేలో పాకిస్థాన్ సైనికులు, ఉగ్రవాదులు కార్గిల్ ద్వారా భారత భూ భాగంలోకి అడుగు పెట్టారు. దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని సూచిన పాక్ సైనికులకు భారత ఆర్మీ తమ పరాక్రమాన్నిరుచి చూపించింది. పాక్ సైనికులపై విరుచుకుని పడింది. దేశం నుంచి దాయాది సైనికులను తరిమికొట్టారు. ‘ఆపరేషన్ విజయ్’ తో కార్గిల్ నుండి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధ భేరీ మ్రోగించింది. ఈ యుద్ధం జూలై 26న ముగిసింది. దీంతో 1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం(Kargil Vijay Diwas)ను భారతీయులు అందరూ ఎంతో ఘనముగా జరుపుకున్నారు. అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం జూలై 26వ కార్గిల్ది విజయ్నో దివస్ గా విజయోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన కార్గిల్ ప్రాంతం చరిత్ర గురించి ఈరోజు తెలుసుకుందాం.

కార్గిల్ యుద్ధం 1999 మే 3 నుంచి జులై 26 మధ్య జరిగింది. కాశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో, నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఇతర ప్రాంతాలలో జరిగింది. 60రోజుల సుదీర్ఘ యుద్ధంలో భారత్ జయభేరి మ్రోగించింది. కార్గిల్ మొత్తం వైశాల్యం 14,086 చదరపు కిలోమీటర్లు. ఇది శ్రీనగర్ నుండి లేహ్ వైపు 205 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్గిల్‌ను నేడు ప్రపంచవ్యాప్తంగా ‘అగ్ని భూమి’ అని పిలుస్తారు. వాస్తవానికి, దీని వెనుక కారణం ఏమిటంటే, కార్గిల్‌లోని అధిక జనాభా షియా ముస్లింలు, అఘా ప్రజలు మత పెద్దలు, బోధకులు.

కార్గిల్ పేరు వెనుక కథ ఏమిటి? కార్గిల్ అనే పేరు ఖర్ , అర్కిల్ అనే రెండు పదాల నుండి ఉద్భవించింది. ఖర్ అంటే ప్యాలెస్ ..  అర్కిల్ అంటే కేంద్రం. ఆ విధంగా ఇది రాజభవనాల కేంద్రంగా ఉంది.  ఎందుకంటే ఈ ప్రాంతం అనేక రాజవంశాల భూభాగాల మధ్యలో ఉంది. అయితే, మరొకొందరు.. కార్గిల్ అనే పదం గర్ .. ఖిల్ అనే పదాల నుండి ఉద్భవించిందని చెబుతున్నారు. స్థానిక భాషలో, గర్ అంటే ‘ఏదైనా ప్రదేశం’ ..  ఖిల్ అంటే ప్రజలు నివసించే ప్రాంతం. కార్గిల్ శ్రీనగర్, స్కార్డో, లేహ్, పాడమ్ నుండి దాదాపు 200 కి.మీ దూరంలో ఉన్న వాస్తవధీ రేఖ. కాలక్రమేణా ఖార్ అర్కిల్ లేదా గర్ ఖిల్ ను  కార్గిల్ గా అని పిలువబడింది.

ఇవి కూడా చదవండి

బ్యూరోక్రాట్ , చరిత్రకారుడు పర్వేజ్ దేవాన్ ‘కార్గిల్ బ్లండర్’ పుస్తకంలో కార్గిల్ అనే వ్యక్తి ఈ ప్రాంతంలో నివసించడానికి అనువుగా మలిచాడని..  షిలిక్‌చాయ్ ప్రాంతంలోని అడవులను తొలగించి నివాసయోగ్య ప్రదేశంగా మార్చాడని.. కాలక్రమంలో ఈ ప్రాంతానికి అతని పేరు మీదుగా కార్గిల్ అని ప్రసిద్ధిగాంచిందని పేర్కొన్నారు.

కార్గిల్‌లో రాజవంశాన్ని స్థాపించిన మొదటి ప్రసిద్ధ యోధుడు గాషో థా థా ఖాన్. థా థా ఖాన్ 8వ శతాబ్దం ప్రారంభంలో కార్గిల్‌ను జయించిన గిల్గిట్ రాజకుటుంబానికి చెందిన వారసుడు. అతని రాజవంశం మొదట్లో కార్గిల్‌లోని సోద్ ప్రాంతాన్ని పాలించింది.. ఆ తర్వాత రాజవంశం షకర్ చిక్కాన్ ప్రాంతంలో శాశ్వతంగా స్థిరపడింది. అదే సమయంలో, 31 ​​అక్టోబర్ 2019 న లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. దీంతో కార్గిల్ లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం కిందకు వచ్చింది.

కార్గిల్ సంస్కృతి ఎలా ఉంటుందంటే?  పురాతన కాలంలో, ప్రస్తుత కార్గిల్ ప్రధాన భాగాన్ని పూరిక్ అని పిలిచేవారు. టిబెటన్ పండితులు ఈ పేరు పెట్టారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు టిబెటన్ల లక్షణాలను కలిగి ఉంటారు. దర్ద్ కులం ప్రజలు ద్రాస్‌లో నివసిస్తున్నారు. లడఖీ ప్రజలు జంస్కార్ సమీపంలో నివసిస్తున్నారు. కార్గిల్‌లో నివసించే ప్రజల వారసులు ఆర్యులు, దర్దులు, టిబెటన్లు, మంగోలులుగా తెలుస్తోంది. కార్గిల్ బహుళ జాతి, బహుభాషా, బహుళ సంస్కృతుల ప్రజలు నివసించే ప్రదేశం. బ్రోగ్పాస్, బాల్టిస్, పూరిక్, షినాస్ , లడఖీ ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఇక ఇక్కడ ప్రజలు  షీనా, బాల్టీ, పూరిగ్, లడఖీ మొదలైనవి భాషలు మాట్లాడతారు. బాల్టీ , షీనా భాషలు ఉర్దూ లిపిని కలిపి ఉంటాయి. దీంతో ఈ ప్రాంతంలో ఉర్దూ సాధారణం.

 కార్గిల్ లో ఇస్లాం మతం ఎప్పుడు అడుగు పెట్టిందంటే..!  ఇస్లాం 15వ శతాబ్దంలో కార్గిల్‌కు చేరుకుంది. మిర్ షమ్స్-ఉద్-దిన్ ఇరాకీ, మధ్య ఆసియా నుండి షియా పాఠశాల పండితుడు.. ఇస్లాం మతాన్ని ప్రచారం చేయడానికి తన మిషనరీలతో కలిసి బాల్టిస్తాన్ , కార్గిల్‌లను సందర్శించాడు. బాల్టిస్తాన్ అధిపతి మొదట ఇస్లాంను స్వీకరించాడు. అనంతరం కార్గిల్ అధిపతులు ఇస్లాంను స్వీకరించారు. మీర్ షమ్స్-ఉద్-దిన్ కంటే ముందు, ఇరాకీ ఖ్వాజా నూర్బక్ష్ కార్గిల్‌ను సందర్శించి అనేక ఇస్లామిక్ ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ విధంగా బౌద్ధమతం సాపి, ఫోకర్, ముల్‌బ్యాక్, వాఖా బోధ్-ఖర్బు ప్రాంతాలు..  కార్గిల్‌లోని దార్చిక్ గార్కోన్,  జన్స్కార్ వంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..