Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది.. డియోఘర్‌ రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొన్నవారితో ప్రధాని మోదీ

కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేసి ఎంతో మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం మొత్తం మీ ధైర్యాన్ని మెచ్చుకుంటుందన్నారు.

PM Modi: దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది..  డియోఘర్‌ రెస్క్యూ ఆపరేషన్‌‌లో పాల్గొన్నవారితో ప్రధాని మోదీ
Pm Modi
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 13, 2022 | 9:25 PM

Jharkhand Ropeway Accident: కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేసి ఎంతో మంది దేశ ప్రజల ప్రాణాలను కాపాడారని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. దేశం మొత్తం మీ ధైర్యాన్ని మెచ్చుకుంటుందన్నారు. బుధవారం జార్ఖండ్‌లోని డియోఘర్‌(Deoghar)లో జరిగిన రోప్‌వే ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న భారత వైమానిక దళం, సైన్యం, NDRF, ITBP, స్థానిక అధికారులు, సామాజిక సంస్థల సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రోప్‌వే ప్రమాదం తరువాత, డియోఘర్‌లో సుమారు 46 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. ఇందులో 56 మంది పర్యాటకుల ప్రాణాలు రక్షించిన సంగతి తెలిసిందే.

ఈ ముఖ్యమైన రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు, జవాన్లతో మాట్లాడిన ప్రధాని మోదీ, మూడు రోజుల పాటు 24 గంటల పాటు కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తి చేశారని అభినందించారు. ఈ ఘటనలో చాలా మంది ప్రాణాలను కోల్పోవడం విచారకరమన్నారు. అయినస్పటికీ సహాయక సిబ్బంది ప్రాణాలకు తెగించి ప్రమాదంలో చిక్కుకున్నవారిని కాపాడం సంతోషదాయకం. దేశం మొత్తం మీ ధైర్యాన్ని మెచ్చుకుందన్నారు.“ బాబా వైద్యనాథ్ ఆశీర్వాదాన్ని నేను అంగీకరిస్తున్నాను, అయినప్పటికీ మనం చాలా మంది సహచరుల ప్రాణాలను రక్షించలేకపోయాము. కొందరికి గాయాలయ్యాయి కూడా. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.” అన్నారు.

‘ఈ ప్రమాదం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నా’ అని ప్రధాని మోదీ అన్నారు, ఈ ఆపరేషన్‌ను చూసిన వారెవరైనా ఆశ్చర్యానికి గురయ్యారని, కలత చెందారని… మీరు అక్కడ ఉన్నారని, పరిస్థితి మీకు ఎంత కష్టంగా ఉందో ఊహించవచ్చని అన్నారు. అయితే ప్రతి సంక్షోభం నుండి దేశ ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురాగల సామర్థ్యం ఉన్న మన సైన్యం, మన వైమానిక దళం, మన ఎన్‌డిఆర్‌ఎఫ్ జవాన్లు, ITBP, పోలీసు సిబ్బంది రూపంలో ఇంత నైపుణ్యం కలిగిన దళం ఉందని దేశం గర్విస్తోంది. ఈ ప్రమాదం నుంచి మనం కూడా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మీ అనుభవాలు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఈ సమయంలో, ప్రధాని మోదీకి ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ఎలా నిర్వహించారో అధికారులు, జవాన్ల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా NDRF అధికారి మాట్లాడుతూ.. తాను సంఘటనా స్థలానికి చేరుకుని స్థానిక ప్రజలతో రెస్క్యూ ఆపరేషన్‌ను ఎలా ప్రారంభించాడో వివరించారు. గాయపడిన మహిళను మేము మొదట గుర్తించామని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

డియోఘర్‌లో అసలేం జరిగింది? ఏప్రిల్ 10 సాయంత్రం జార్ఖండ్‌లోని డియోఘర్‌లోని త్రికుట్ పర్వతంపై పర్యాటకుల కోసం రోప్‌వే కేబుల్ కార్లు ఢీకొన్నాయి. దీని తరువాత, చాలా మంది 1,500 నుండి 2,000 అడుగుల ఎత్తులో 25 కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. వాటిని తొలగించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దీని తరువాత, సుమారు 46 గంటల రెస్క్యూ ఆపరేషన్ తర్వాత, ఎయిర్ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), ఆర్మీ సిబ్బంది ఎంఐ 17 హెలికాప్టర్ల సహాయంతో చిక్కుకుపోయిన వారిని రక్షించారు. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. హెలికాప్టర్‌ నుంచి రక్షించే క్రమంలో కింద పడి ఇద్దరు మృతి చెందారు.

Read Also….  Assam: అస్సాంలో దారుణం.. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 24 గంటల్లో 13 మంది మృతి