AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main Result 2021: జేఈఈ మెయిన్ 2021 రిజల్ట్స్ ఇవాళే

జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021), ఫిబ్రవరి పరీక్షకు సంబంధించిన ఫలితాలు బహుశా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో

JEE Main Result 2021: జేఈఈ  మెయిన్ 2021 రిజల్ట్స్ ఇవాళే
Venkata Narayana
|

Updated on: Mar 07, 2021 | 8:39 AM

Share

జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021), ఫిబ్రవరి పరీక్షకు సంబంధించిన ఫలితాలు బహుశా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో మార్చి 7, 2021 న చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్‌టిఎ ఫిబ్రవరి పరీక్షలో హాజరైన అభ్యర్థులకు ఎన్‌టిఎ స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. అలాగే, అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో నవీకరించబడిన గత పరీక్షల క్యాలెండర్ ప్రకారం ఫలితాల తేదీలను కూడా అభ్యర్థులు గమనించవచ్చు. ఇక, ఇవాళ పేపర్ 1 ఫలితాలు మాత్రమే విడుదల కానున్నాయి.

ఇలా ఉండగా, జేఈఈ -2021 విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో జేఈఈ-2021 నిర్వహిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షలో కీలక మార్పులు చేశారు. ప్రశ్నపత్రాల్లో ఆప్షన్లను పెంచడంతోపాటు మాతృభాషలో రాసుకునే అవకాశం కల్పించారు. అలాగే.. నెగెటివ్‌ మార్కులను తొలగించారు. ఈసారి జేఈఈని ఇంగ్లీష్‌, హిందీతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించారు. ఇందులో తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, పంజాబి, ఒడి యా, కన్నడ, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామి ఉన్నాయి.

ఇప్పటివరకూ జేఈఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించేవారు. ఈసారి మాత్రం నాలుగుసార్లు నిర్వహించాలని తలపెట్టారు. మొదటిసారి పరీక్షలో ఏమైనా పొరపాట్లు జరిగిన వారికి, ఇతర బోర్డుల పరీక్షల కారణంగా రాయలేనివారికి మరోసారి రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఎవరైనా అభ్యర్థి నాలుగు సార్లూ పరీక్షలకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కు లు వస్తే దాన్ని పరిగణనలోనికి తీసుకుంటామని ఎన్టీఏ పేర్కొంది.

Read also : Kashmir : కశ్మీర్లో కల్లోలానికి ముష్కరుల స్కెచ్‌, రియాసిలో ఉగ్రవాదుల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..