AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawaharlal Nehru: ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండటం చాలా అవసరం.. విపక్షాల పాత్రపై నెహ్రూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని తెగువ చూపిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ ప్రథమ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ఈ స్థాయి వరకు చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. దేశ...

Jawaharlal Nehru: ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉండటం చాలా అవసరం.. విపక్షాల పాత్రపై నెహ్రూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Jawaharlal Nehru
Ganesh Mudavath
|

Updated on: Nov 14, 2022 | 11:46 AM

Share

స్వాతంత్ర్య పోరాటంలో ఎనలేని తెగువ చూపిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర భారతదేశ ప్రథమ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. అయితే ఆయన ఈ స్థాయి వరకు చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. దేశ ప్రజల్లో ఆయనకున్న ఆదరణ అపారమైంది. గాంధీజీకి ఆయన పట్ల ప్రత్యేక అభిమానం ఉండేది. ఆయన విజయయాత్ర ఎన్నో ఆటుపోట్ల మధ్య సాగింది. 1937 లో మూడోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో తనలోని కలకత్తా పత్రిక ‘మోడరన్ రివ్యూ’ కు ‘ప్రెసిడెంట్ జవహర్ లాల్’ అనే శీర్షికతో చాణక్యుడు అనే లైనప్ తో రాసిన కథనం చర్చనీయాంశంగా మారింది. స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ పరిషత్ తర్వాత తాత్కాలిక పార్లమెంట్‌గా మారింది. అక్కడ మాట్లాడిన నెహ్రూ.. “గత కొన్ని నెలలుగా ఏం జరిగినా భారత ప్రజలు నాలాంటి వ్యక్తిని ఎందుకు సహిస్తున్నారని నేను తరచుగా ఆలోచిస్తున్నాను? నేను ప్రభుత్వంలో లేకుంటే ఈ ప్రభుత్వాన్ని తట్టుకోగలిగేవాడినని నేనే ఖచ్చితంగా చెప్పలేను ” అని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచనలంగా మారింది. 313 మంది సభ్యులున్న సభలో అధికారికంగా ఎలాంటి ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్‌లో లేని వారిని, అనుబంధం లేని సభ్యులుగా పరిగణించారు. ప్రారంభంలో వారి సంఖ్య 22. 1951లో ఆ సంఖ్య 28 కి పెరిగింది. మరో విషయం ఏమిటంటే.. ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం కూడా వదలని కాంగ్రెస్ సభ్యులు అప్పట్లో చాలా మందే ఉన్నారు.

పార్టీలో ఉండగానే ప్రభుత్వాన్ని విమర్శించిన మహావీర్ త్యాగి, ఆర్కే సిద్వాలకు మంత్రి పదవులు లభించాయి. ఆచార్య కృపలానీ కూడా ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన మొదట కాంగ్రెస్‌లోనే ప్రజాస్వామ్య పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీలో ఒంటరిగా భావించి కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీని స్థాపించారు. పార్టీని వీడిన తర్వాత కూడా రఫీ అహ్మద్ కిద్వాయ్ మంత్రిగా కొనసాగాలని నెహ్రూ కోరారు. తర్వాత కిద్వాయ్ తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆచార్య కృపలానీ, శ్యామా ప్రసాద్ ముఖర్జీ విమర్శలను నెహ్రూ పరిగణలోకి తీసుకునేవారు. 1951 మార్చి 14న తన చిరస్మరణీయ ప్రసంగంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రభుత్వ బలహీనతలు, అవినీతిపై కృపలానీ చేసిన మాటల తూటాలకు పార్లమెంట్ దద్దరిల్లింది. ఆయన చేసిన వ్యాఖ్యలను నెహ్రూ కూడా అంగీకరించడం గమనార్హం.

సభలో సమర్థవంతమైన ప్రతిపక్షం ఉంటే.. ప్రభుత్వ లోపాలపై దృష్టిని ఆకర్షించడం, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం వంటివి లభిస్తాయి. సమర్థవంతమైన వ్యతిరేకత లేకపోతే అభివృద్ధిలో వెనకబడి పోతున్నట్లు నెహ్రూ విశ్వసించేవారు. మే 22, 1952న ఎన్నికైన మొదటి లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై నాలుగు రోజులపాటు చర్చ జరిగింది. ఏ ప్రభుత్వమైనా విమర్శకులు, ప్రతిపక్షాలను కలిగి ఉండటం అవసరమని తాను నమ్ముతున్నానని, విమర్శలు లేకుంటే అభివృద్ధి అంతటితో ఆగిపోతుందని నెహ్రూ నమ్మేవారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీకి ఎలాంటి మొహమాటం లేకుండా క్షమాపణ చెప్పినప్పుడు పార్లమెంటరీ మర్యాదలకు సంబంధించిన అపూర్వ దృశ్యం ఆవిష్కృతమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..